T Series Clarity On Bhagyashri Borse Movie: టాలీవుడ్ న్యూ క్రష్ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్లో ఓ పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకుందంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు మిలాప్ జవేరీ దర్శకత్వంలో రానున్న ఒక హై-వోల్టేజ్ 'యాక్షన్ అండ్ వయలెంట్ లవ్ స్టోరీ'లో భాగ్యశ్రీని హీరోయిన్గా ఎంపిక చేశారంటూ ఫిలింఫేర్ సహా పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఖండించిన బాలీవుడ్ మేకర్స్

అయితే ఈ ప్రచారంపై బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధికారికంగా స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టింది. భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్గా తీసుకున్నట్లు వస్తున్న ఊహాగానాలను టీ-సిరీస్ ప్రతినిధి ఖండించారు.
త్వరలోనే హీరోయిన్ అధికారిక ప్రకటన
"ఆదిత్య రాయ్ కపూర్, మిలాప్ జవేరీ కాంబినేషన్లో మేము నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోందంటూ వస్తున్న వార్తలు ఎంతమాత్రం నిజం కాదు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం" అని టీ-సిరీస్ స్పష్టం చేసింది.
సీక్రెట్గా సినిమా వివరాలు
చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతోంది. లవ్, యాక్షన్, భావోద్వేగాలు పుష్కలంగా ఉండే కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు మిలాప్ జవేరీ గతంలోనే వెల్లడించారు.
ప్రేమ కథలను తెరకెక్కించడంలో
'మర్జావాన్', 'ఏక్ దివానే కీ దివానియత్' వంటి చిత్రాలతో ప్రేమకథలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన మిలాప్, ఈసారి ఆదిత్యతో అంతకుమించిన లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారు.
మొదట బాలీవుడ్లో చిన్న పాత్రలతో
ఇక 'యారియాన్ 2', 'చందు ఛాంపియన్' సినిమాల్లో చిన్న పాత్రల ద్వారా బాలీవుడ్లో మెరిసిన భాగ్యశ్రీ బోర్సేకు, ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఓకే అయ్యుంటే హిందీలో హీరోయిన్గా మొదటి పెద్ద అవకాశమయ్యేది. అయితేనేం, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆమె క్రేజ్ మామూలుగా లేదు.
రవితేజతో తొలి తెలుగు సినిమా
మాస్ మహారాజా రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ తన అందం, గ్లామర్తో మొదటి మూవీతోనే ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది.
కాంతలో నటనకు ప్రశంసలు
{{/usCountry}}మాస్ మహారాజా రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ తన అందం, గ్లామర్తో మొదటి మూవీతోనే ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది.
కాంతలో నటనకు ప్రశంసలు
{{/usCountry}}ఆ తర్వాత విజయవంతమైన ప్రాజెక్టులతో సౌత్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది భాగ్యశ్రీ బోర్సే. దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా, సముద్రఖనిలతో కలసి చేసిన తమిళ చిత్రం 'కాంత'లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
శివ కార్తికేయన్ మూవీలో
అక్కినేని అఖిల్ రీ-ఎంట్రీ మూవీ 'లెనిన్'లోనూ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన కమల్ హాసన్ నిర్మాణంలో రానున్న 'సేయోన్' చిత్రంలో భాగ్యశ్రీ నటిస్తోంది. బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైనా, సౌత్లో మాత్రం ఈ ముంబై భామ వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతోంది.