...
...
Next Story

Dhandha OTT Review: దందా ఓటీటీ రివ్యూ- డిజిటల్ నేరాలపై యూట్యూబర్ దొర సాయి తేజ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

Dhandha OTT Review And Rating In Telugu: మొబైల్ స్క్రీన్‌లపై నిమిషాల్లో కట్టిపడేసే వర్టికల్ ఫార్మాట్‌లో వచ్చిన ఓటీటీ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దందా. పాపులర్ యూట్యూబర్ దొర సాయి తేజ నటించిన దందా చాయ్ షాట్స్ యాప్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ సిరీస్ ఎలా ఉందో నేటి దందా రివ్యూలో చూద్దాం.

Published on: Aug 2, 2026, 20:13:15 IST
Advertisement

OTT Series Dhandha Review In Telugu And Rating: ఓటీటీ ప్రపంచంలో కంటెంట్ వందల గంటల నిడివితో వస్తున్న ఈ రోజుల్లో, కేవలం నిమిషం వ్యవధి ఉండే ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న 'వర్టికల్ ఓటీటీ సిరీస్' సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఇదే ఫార్మాట్‌లో పూర్తి స్థాయి సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఓటీటీ సిరీస్ 'దందా' (Dhandha).

కేవలం రెండున్నర నిమిషాల రన్‌టైమ్

దందా ఓటీటీ రివ్యూ- డిజిటల్ నేరాలపై యూట్యూబర్ దొర సాయి తేజ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
దందా ఓటీటీ రివ్యూ- డిజిటల్ నేరాలపై యూట్యూబర్ దొర సాయి తేజ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

ప్రముఖ వర్టికల్ ప్లాట్‌ఫామ్ చాయ్ షాట్స్‌లో దందా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 26 ఎపిసోడ్లు, ఒక్కోటి రెండున్నర నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ 64 నిమిషాల ఓటీటీ క్రైమ్ డ్రామా, మొదటి క్షణం నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాక్కెళ్తుంది.

దందా ఓటీటీ రివ్యూ

ఒక ఎపిసోడ్ ముగియగానే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ 'బింజ్ వాచ్' చేయించడంలో ఈ సిరీస్ పూర్తి విజయం సాధించింది. యూట్యూబర్ దొర సాయి తేజ హీరోగా చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో నేటి దందా ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

బీటెక్ స్టూడెంట్ అయిన అరవింద్ (దొర సాయి తేజ)కు డబ్బు, పవర్‌పై కోరిక చాలా బలంగా ఉంటుంది. క్లాస్‌లో కంటే హైదరాబాద్ డార్క్ సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే ఎక్కువ సేపు గడుపుతుంటాడు అరవింద్. తన తెలివితేటలకు అక్కడే సరైన గుర్తింపు దక్కుతుందని భావిస్తుంటాడు.

చిన్న చిన్న ఆన్‌లైన్ మోసాలతో స్టార్ట్ చేసి ఫిషింగ్ స్కామ్స్, ఫేక్ కాల్ సెంటర్స్, బ్లాక్ మెయిల్స్, గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ వంటి పెద్ద నేరాలకు పాల్పడతాడు అరవింద్. మరి ఈ క్రమంలో అరవింద్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అరవింద్ సైబర్ క్రైమ్స్ ఎలా చేయగలిగాడు? డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌లో అరవింద్ ఎలాంటి స్థాయికి ఎదిగాడు? అనేదే దందా కథ.

విశ్లేషణ:

ఫిషింగ్ స్కామ్‌లు, నకిలీ కాల్ సెంటర్లు, గ్యాంగ్‌స్టర్ రాజకీయాలు ఎలా నడుస్తాయో దర్శకుడు కథనంలో చాలా సహజంగా చూపించారు. మన చుట్టూ రోజూ పత్రికల్లో చూసే సైబర్ నేరాల వెనుక ఉన్న ముఠాల నెట్‌వర్క్‌ను, వారి నెగెటివ్ మైండ్‌సెట్‌ను ఎక్కడా క్లాస్ పీకకుండా ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో చూపించిన ప్రతీ స్కామ్ ఎంతో రీసెర్చ్ చేసి రాసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

అదిరిపోయే టెక్నికల్ వాల్యూస్

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఆదిత్య దేవులపల్లి నెరేషన్, సీన్ కాంపోజిషన్ ఎంతో నైపుణ్యంతో సాగాయి. మొబైల్ స్క్రీన్‌ల కోసం తీసినప్పటికీ, అశ్విన్ లెనిన్ అందించిన సినిమాటోగ్రఫీ మంచి అనుభూతిని ఇస్తుంది. రిషి ఎం అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ సీన్‌లో టెన్షన్‌ను పెంచుతూ కథకు తగిన మూడ్ ఎలివేట్ చేస్తుంది.

విజయ్ కుమార్, ఆదిత్య కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే, ఫోర్త్-వాల్ నరేషన్ (ప్రేక్షకుడితో నేరుగా మాట్లాడటం), డార్క్ హ్యూమర్ ఈ సిరీస్‌ను మామూలు గ్యాంగ్‌స్టర్ సినిమాలకు భిన్నంగా నిలబెట్టాయి. క్లైమాక్స్ బాగుంది.

ఆకట్టుకునేల సాయి తేజ నటన

ఇక యూట్యూబ్‌లో తనదైన శైలి నటనతో విశేష ఆదరణ పొందిన దొర సాయి తేజ యాక్టింగ్ సిరీస్‌కు బాగా కలిసి వచ్చిన అంశం. కేవలం యాంటీ హీరో పాత్రను పోషించడమే కాకుండా, ఆ పాత్రలోని నెగెటివ్ షేడ్స్ బాగా పండించాడు. అమయాకంగా కనిపిస్తూ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న అరవింద్ పాత్రలోని హావాభావాలు, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

అలాగే, విలన్‌గా ప్రకాష్ ఠాకూర్, పోలీస్ ఆఫీసర్ ఆదిత్య సింగ్ పాత్రలో నితిన్ ప్రసన్న పోటీపడి నటించారు. చివరి ఎపిసోడ్ ముగిసిన తీరు రెండవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే అతి తక్కువ నిడివితో, అదిరిపోయే సస్పెన్స్‌తో సాగే సైబర్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి 'దందా' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe