భారతీయ చలనచిత్ర రంగంలో మలయాళ సినిమాలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. చిన్న బడ్జెట్తో వచ్చి అద్భుతమైన కథాంశాలతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న కేరళ సినిమాలపై బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.

త్వరలో విడుదల కానున్న ‘కెన్నెడీ’ సినిమా ప్రచారంలో భాగంగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ 2025లో వచ్చిన మలయాళ హిట్ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్పై సెటైర్లు వేశారు.
“అక్కడ ఉన్న మద్దతు ఇక్కడ ఉండదు”
మలయాళ చిత్రాల విజయం వెనుక ఉన్న రహస్యాన్ని అనురాగ్ కశ్యప్ వివరిస్తూ.. “కేరళ అత్యంత విద్యావంతులు, సినిమాను ప్రేమించే ప్రేక్షకులు ఉన్న రాష్ట్రం. అక్కడ ఫిలిం క్లబ్స్ ఉన్నాయి, సినిమా సంస్కృతి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక దర్శకుడికి మరో దర్శకుడు మద్దతుగా నిలుస్తారు” అని పేర్కొన్నారు.
రీసెంట్ హిట్ ‘రేఖాచిత్రం’ గురించి మాట్లాడుతూ.. “ఆ సినిమాలో మమ్ముట్టి వాయిస్ను వాడుకోవడానికి వారు వెనుకాడలేదు. కానీ, ఇక్కడ (బాలీవుడ్లో) నేను ఒకరి పేరును కానీ, ఒక సినిమా నేపథ్యాన్ని కానీ ఊరికే వాడలేను. వెంటనే కేసులు వేస్తారు. ఒక సినిమా చుట్టూ మరో సినిమాను నిర్మించే స్వేచ్ఛ ఇక్కడ లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు అనురాగ్ కశ్యప్.
మోహన్ లాల్ సింప్లిసిటీ..
మరికొన్ని చిత్రాల గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “నిన్ననే ‘తుడరుమ్’ సినిమా చూశాను. ఎంత సహజంగా ఉందో! అందులో మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ ఒక సాదాసీదా టాక్సీ డ్రైవర్గా లుంగీ కట్టుకుని కనిపిస్తారు. ఇక్కడ హీరోను టాక్సీ డ్రైవర్ అంటే ఎవరూ ఒప్పుకోరు. అందరికీ డిజైనర్ దుస్తులు కావాలి” అని కొనియాడారు.
ఎకో అద్భుత క్లైమాక్స్
“అలాగే ‘ఎకో’ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అయ్యాను. మేఘాలయకు చెందిన ఒక స్కూల్ టీచర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. స్టార్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ (ప్రేక్షకుల మాట) ద్వారానే ఈ సినిమాలు నిలబడుతున్నాయి. నేను ఏడాదిలో చూసే హిందీ సినిమాల కంటే వారంలో చూసే మలయాళ సినిమాలే ఎక్కువ” అని అనురాగ్ కశ్యప్ తెలిపారు.
అనురాగ్ మెచ్చిన ఆ 3 సినిమాల ఓటీటీలు
{{/usCountry}}“అలాగే ‘ఎకో’ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అయ్యాను. మేఘాలయకు చెందిన ఒక స్కూల్ టీచర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. స్టార్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ (ప్రేక్షకుల మాట) ద్వారానే ఈ సినిమాలు నిలబడుతున్నాయి. నేను ఏడాదిలో చూసే హిందీ సినిమాల కంటే వారంలో చూసే మలయాళ సినిమాలే ఎక్కువ” అని అనురాగ్ కశ్యప్ తెలిపారు.
అనురాగ్ మెచ్చిన ఆ 3 సినిమాల ఓటీటీలు
{{/usCountry}}రేఖాచిత్రం ఓటీటీ: 1985లో ఒక సినిమా షూటింగ్ సమయంలో అదృశ్యమైన నటి ‘రేఖ’ (అనస్వర రాజన్) చుట్టూ తిరిగే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో మమ్ముట్టి వాయిస్ను కథలో కీలకంగా వాడారు. 7.8 రేటింగ్ ఉన్న రేఖా చిత్రం సోనీ లివ్లలో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తుడరుమ్ ఓటీటీ: తరుణ్ మూర్తి దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శోభన నటించిన ఈ చిత్రం 2025లో అతిపెద్ద హిట్గా నిలిచి రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 7.5 రేటింగ్తో అదరగొట్టిన ఫ్యామిలీ క్రైమ్ సస్పెన్స్ డ్రామా తుడరుమ్ జియో హాట్స్టార్లో ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఎకో ఓటీటీ: ‘కిష్కింధా కాండం’ టీమ్ రూపొందించిన ఎకో చిత్రం గతేడాది డిసెంబర్లో విడుదలై సూపర్ హిట్ అయింది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఎకో నెట్ఫ్లిక్స్లో ఓటీటీ రిలీజ్ అయింది. 7.8 రేటింగ్ ఉన్న ఎకో ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
బెస్ట్ ఛాయిస్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు అయిన అనురాగ్ కశ్యప్ మెచ్చిన ఈ మూడు మలయాళ సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. నాలుగు డిఫరెంట్ ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలు థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్.