Mrunal Thakur Pooja Meri Jaan OTT Streaming: 'సీతారామం', 'హాయ్ నాన్న' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'పూజా మేరీ జాన్'.
నాలుగేళ్ల నిరీక్షణకు తెర

ఈ సినిమా పూజా మేరీ జాన్ ఓటీటీలోకి వచ్చేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తయి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా రకరకాల కారణాలతో థియేటర్లలోకి రాకపోయిన పూజా మేరీ జాన్ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని పాపులర్ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) అధికారికంగా తాజాగా వెల్లడించింది.
గాంధీ జయంతి కానుకగా స్ట్రీమింగ్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జీ5లో పూజా మేరీ జాన్ ఓటీటీ రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి 4 భాషల్లో కూడా పూజా మేరీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. "కొన్ని కథలు మీరు చూసేదాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. మరికొన్ని మీరు నమ్మేదాన్ని నిలదీస్తాయి. ఈ సినిమా మాత్రం రెండింటి మధ్య ఉండే ప్రతీ విషయాన్ని ప్రశ్నించేలా చేస్తుంది" అని జీ ఓటీటీ సంస్థ పేర్కొంది.
కథేంటి?
'స్త్రీ', 'ముంజ్యా' వంటి వరుస బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవజోత్ గులాటీ దర్శకుడిగా వ్యవహరించారు.
{{/usCountry}}'స్త్రీ', 'ముంజ్యా' వంటి వరుస బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవజోత్ గులాటీ దర్శకుడిగా వ్యవహరించారు.
{{/usCountry}}తీవ్రమైన మానసిక ఆరాటం (Obsession), అనుమానాలు, సమాజంలో ఉండే మూస ధోరణుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక్క వ్యక్తి చేసిన పనులు ఎలాంటి పర్యవసానాలకు దారితీశాయనే అంశాన్ని థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు.
మృణాల్ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇందులో పూజ అనే టైటిల్ పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. ఆమె ప్రేమికుడు అనికేత్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, ఆ నింద పూజపై పడుతుంది. మరోవైపు, వీరిద్దరికీ ఆత్మీయ మిత్రురాలైన లాయర్ సనా పాత్రలో హుమా ఖురేషి నటించారు.
స్నేహితురాలికి మద్దతుగా నిలబడాలో లేదా మిత్రుడి మరణాన్ని తల్చుకుని బాధపడాలో తెలియక సనా సతమతమవుతుంది. ఈ ముక్కోణపు భావోద్వేగాల నడుమ కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఉత్కంఠ రేపే సస్పెన్స్ డ్రామా
తన పాత్ర గురించి మృణాల్ స్పందిస్తూ.. "ఈ కథలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఊహకందని మలుపులతో సాగుతుంది. వాస్తవానికి, మన ఆలోచనలకు మధ్య ఉన్న గీతను ఈ చిత్రం చెరిపేస్తుంది" అని తెలిపారు.
నవజోత్ గులాటీతో కలిసి కనిష్క ఈ చిత్రానికి కథ అందించగా, విశాల్ మిశ్రా సంగీతం సమకూర్చారు. విపాషా అరవింద్ సహ దర్శకురాలిగా వ్యవహరించారు. విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారు.
ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్పై ఆసక్తి
దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా పూజా మేరీ జాన్ ఓటీటీలోకి వస్తుండటంతో ఈ క్రైమ్ థ్రిల్లర్పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.