గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలో ‘ది బ్లఫ్’ (The Bluff) అనే ఓటీటీ సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో ఆమె ఒక మాజీ సముద్రపు దొంగగా (పైరేట్) నటిస్తున్నారు.
తల్లి ధైర్యసాహసాల గురించి

ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన తల్లి మధు చోప్రాలోని అసలైన ధైర్యసాహసాల గురించి ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రియాంకకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఒక సంఘటనను ప్రియాంక చోప్రా గుర్తు చేసుకున్నారు.
క్యాబ్ డ్రైవర్ గొంతు పట్టుకున్న అమ్మ!
"మేము ఢిల్లీలోని ఒక హోటల్లో ఉంటున్నాము. ఒకసారి క్యాబ్లో వెళ్తుండగా, డ్రైవర్ సడెన్గా దారి మార్చి తెలియని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అది షార్ట్కట్ అని అతను చెప్పినప్పటికీ, అక్కడ ఎవరూ లేకపోవడంతో నా తల్లి ప్రమాదాన్ని పసిగట్టారు. వెనక సీట్లో కూర్చున్న మా అమ్మ, వెంటనే డ్రైవర్ గొంతును గట్టిగా పట్టుకున్నారు. వెంటనే మెయిన్ రోడ్డుకు వెళ్లమని హెచ్చరించారు" అని ప్రియాంక చోప్రా తెలిపారు.
చెంపదెబ్బ కొట్టి మరి
అంతటితో ఆగకుండా మధు చోప్రా ఆ డ్రైవర్ను చెంపదెబ్బ కొట్టి మరీ వెనక్కి తీసుకెళ్లారట. "నేను నా కూతురితో ఉన్నాను అని గర్జిస్తూ ఆమె చేసిన ఆ పని చూసి నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత నాలుగు నెలల వరకు ఆమెతో దేనికీ వాదించే సాహసం చేయలేదు" అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.
ఒంటరిగా ఉంటే చేసేది కాదేమో
"హోటల్కు వచ్చాక అమ్మ భయంతో వణికిపోయింది. బహుశా ఆమె ఒంటరిగా ఉంటే అలా చేసేది కాదేమో.. కానీ నేను తోడుండటంతో తనలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో ఆ యాంగిల్, ఆ ధైర్యాన్ని అప్పటివరకు ఎప్పుడు చూడలేదు" అని ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయ్యారు.
త్వరలో ‘ది బ్లఫ్’ సందడి
{{/usCountry}}"హోటల్కు వచ్చాక అమ్మ భయంతో వణికిపోయింది. బహుశా ఆమె ఒంటరిగా ఉంటే అలా చేసేది కాదేమో.. కానీ నేను తోడుండటంతో తనలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో ఆ యాంగిల్, ఆ ధైర్యాన్ని అప్పటివరకు ఎప్పుడు చూడలేదు" అని ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయ్యారు.
త్వరలో ‘ది బ్లఫ్’ సందడి
{{/usCountry}}ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది బ్లఫ్’ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు. ఇందులో కార్ల్ అర్బన్ వంటి హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషించారు.
రాజమౌళి సినిమాతో రీ-ఎంట్రీ!
ప్రియాంక చోప్రా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంతో ప్రియాంక ఇండియన్ స్క్రీన్ పైకి తిరిగి రానున్నారు.
ఇందులో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తుండగా, మహేశ్ బాబు ‘రుద్ర’గా కనిపించనున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్న ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.