సినిమా తారలు ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ ఉత్సాహం హద్దులు దాటి సెలబ్రిటీల అసహనానికి కారణమవుతుంది. తాజాగా బిగ్ బాస్ హిందీ 17 ఫేమ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ పాపరాజీల (ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు.
గౌరవం సంపాదించుకోవడం మీ చేతుల్లోనే ఉంది!

ఆదర్శ్ గౌరవ్, షనయ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ 'తూ యా మైన్' (Tu Yaa Main) సినిమా ప్రీమియర్ షోకు ఆయేషా ఖాన్ హాజరయ్యారు. అక్కడ రెడ్ కార్పెట్పై ఫోటోలకు ఆయేషా ఖాన్ ఫోజులిస్తుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను వెనుక వైపు నుంచి షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆయేషా ఖాన్ వెంటనే ఫోజులు ఆపేసి సదరు ఫోటోగ్రాఫర్ను నేరుగా ప్రశ్నించారు.
ఇది పద్ధతి కాదు
"గౌరవం సంపాదించుకోవాలన్నా, దానిని పోగొట్టుకోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంటుంది. దయచేసి ఇలా చేయకండి (బ్యాక్ నుంచి ఫొటోలు తీయడం), ఇది పద్ధతి కాదు. చూడటానికి అస్సలు బాగోదు" అంటూ ఫొటోగ్రాఫర్స్కు అందరికి కలిపి ఆయేషా ఖాన్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు.
వీడియో వైరల్
ఆయేషా ఖాన్ ఆగ్రహాన్ని చూసిన మిగతా ఫోటోగ్రాఫర్లు కూడా సదరు వ్యక్తిని వారించారు. కొద్దిసేపు సీరియస్ లుక్ ఇచ్చిన ఆయేషా ఖాన్ ఆ తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చి లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఫొటోగ్రాఫర్లకు ఆయేషా ఖాన్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిజీగా ఆయేషా కెరీర్
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయేషా ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ధురంధర్’ సినిమాలోని ‘శరారత్’ పాటతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కపిల్ శర్మ ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’లోనూ ఆయేషా ఖాన్ నటించారు.
ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు
{{/usCountry}}బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయేషా ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ధురంధర్’ సినిమాలోని ‘శరారత్’ పాటతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కపిల్ శర్మ ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’లోనూ ఆయేషా ఖాన్ నటించారు.
ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు
{{/usCountry}}2025లో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ సినిమాలో ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. వీటికంటే ముందు బిగ్ బాస్ తర్వాత తెలుగులో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్గా కనువిందు చేశారు ఆయేషా ఖాన్. ఇదే కాకుండా ముఖచిత్రం, శర్వానంద్ మనమే సినిమాలో కూడా మెరిశారు గ్లామరస్ భామ ఆయేషా ఖాన్.
గతంలోనూ తారల ఆగ్రహం
కాగా, ఫోటోగ్రాఫర్ల అతి ప్రవర్తనపై గళమెత్తిన మొదటి హీరోయిన్ ఆయేషా ఖాన్ మాత్రమే కాదు. గతంలో జాన్వీ కపూర్ కూడా ఈ ‘తప్పుడు యాంగిల్స్’ నుంచి ఫోటోలు తీయవద్దని బహిరంగంగానే చెప్పారు.
మృణాల్ ఠాకూర్ కూడా
తన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని మృణాల్ ఠాకూర్, తన మాట వినడం లేదని పాలక్ తివారీ కూడా గతంలో పాపరాజీలపై అసహనం వ్యక్తం చేశారు. ఇక కరీనా కపూర్, అలియా భట్ వంటి అగ్ర తారలు తమ పిల్లల ఏకాంతానికి భంగం కలగకుండా ఫోటోలు తీయవద్దని ఎప్పుడూ కోరుతూనే ఉంటారు.