...
...
Next Story

OTT: పాలకులు వర్సెస్ శ్రామికులు- వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా విభిన్న ఓటీటీ షో రైజ్ అండ్ ఫాల్ 2- ఫ్రీగానే చూడొచ్చు!

Virender Sehwag Host Rise And Fall Season 2 OTT Release: ఓటీటీ ప్రేమికులను ఆకట్టుకున్న 'రైజ్ అండ్ ఫాల్' రియాలిటీ షో సీజన్ 2కు సిద్ధమైంది. టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి నలుగురు కంటెస్టెంట్ల పేర్లను, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించారు.

Published on: Sep 17, 2026, 14:24:22 IST
Advertisement

Virender Sehwag Host Rise And Fall Season 2 OTT Streaming: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' రెండో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

వీరేంద్ర సెహ్వాగ్ హోస్టింగ్ బాధ్యతలు

పాలకులు వర్సెస్ శ్రామికులు- వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా విభిన్న ఓటీటీ షో రైజ్ అండ్ ఫాల్ 2- ఫ్రీగానే చూడొచ్చు!
పాలకులు వర్సెస్ శ్రామికులు- వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా విభిన్న ఓటీటీ షో రైజ్ అండ్ ఫాల్ 2- ఫ్రీగానే చూడొచ్చు!

మొదటి సీజన్‌లో అశ్నీర్ గ్రోవర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఈసారి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది.

ఆ ముగ్గురు టీవీ స్టార్లతో పాటు రాజకీయ నాయకుడు!

వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ ఈ ఓటీటీ షోపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది ప్రముఖులు పోటీ పడనున్నారు. తాజాగా విడుదల చేసిన రైజ్ అండ్ ఫాల్ 2 ప్రోమోలో మేకర్స్ మొదటి నలుగురు కంటెస్టెంట్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక చాహర్ చౌదరి, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్, ప్రముఖ బుల్లితెర నటుడు కరణ్ పటేల్, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావల్లాలను ఈ సీజన్‌లో రంగంలోకి దించారు. ఈ నలుగురు ప్రోమోలోనే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ల్యాండ్ అయ్యారు.

రూలర్ నుంచి వర్కర్ వరకు

తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పే నటి స్వర భాస్కర్ స్పందిస్తూ.. "భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే చోట చేరినప్పుడు వ్యూహాలు, అధికార పోరాటాలు కలగలసి డ్రామా పండుతుంది. ఈ ఆట ఎలా సాగుతుందో చూడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని వ్యాఖ్యానించారు.

గెలుపే లక్ష్యంగా దిగుతున్న కంటెస్టెంట్లు

తనలోని పోటీ తత్వాన్ని బయటకు తీయడానికే ఈ షోకు వచ్చానంటున్నారు బుల్లితెర హీరో కరణ్ పటేల్. "ఇన్నాళ్లూ నటుడిగా రకరకాల పాత్రల్లో నన్ను చూశారు. ఇప్పుడు నిజమైన కరణ్ పటేల్‌గా నా సత్తా చాటే అవకాశం వచ్చింది. ఇదొక పెద్ద సవాలు, కచ్చితంగా నా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాను" అని సీరియల్ హీరో కరణ్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ వేదికలపై వాగ్ధాటితో ఆకట్టుకునే షెహజాద్ పూనావల్లా తన ఎంట్రీపై స్పందిస్తూ.. "నా జీవితమే ఎత్తుపల్లాల కలయిక. భారత్‌ను, మన చరిత్రను తక్కువ చేసి మాట్లాడే వారిని నేను అసలు సహించను. అపరిచితులతో కలిసి వ్యూహాలు పన్నడం ఆసక్తికరంగా ఉంటుంది. రాబోయే ఆరు వారాల పాటు నాకు అద్దె భారం తగ్గడం సంతోషంగా ఉంది" అంటూ సరదాగా నవ్వేశారు.

ఏంటి ఈ గేమ్ షో కాన్సెప్ట్? ఎప్పటినుంచి ఓటీటీ స్ట్రీమింగ్?

బానిజయ్ ఆసియా సంస్థ నిర్మిస్తున్న ఈ షో కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుంది. పోటీదారులను 'రూలర్స్' (పాలకులు), 'వర్కర్స్' (శ్రామికులు) అనే రెండు వర్గాలుగా విభజిస్తారు. రూలర్స్ పెంట్‌హౌస్‌లో రాజభోగాలు అనుభవిస్తే, వర్కర్లు బేస్‌మెంట్‌లో ఉంటూ కష్టపడాల్సి ఉంటుంది.

వ్యూహాల ఆధారంగా స్థానాల మార్పు

ఆటలో వారు తీసుకునే నిర్ణయాలు, వేసే వ్యూహాల ఆధారంగా స్థానాలు మారుతుంటాయి. మొదటి సీజన్‌లో ప్రముఖ బుల్లితెర హీరో అర్జున్ బిజ్లానీ విజేతగా నిలిచారు. ఇకపోతే అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటి రెండు ఓటీటీల్లో రైజ్ అండ్ ఫాల్ 2 స్ట్రీమింగ్ కానుంది.

రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్

సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లలో రైజ్ అండ్ ఫాల్ 2 ఉచితంగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాహ్ హోస్ట్‌గా చేస్తున్న ఈ షోను ఎంచక్కా ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks