తెలుగు వినోద రంగంలో అగ్రగామి ఛానెల్గా జీ తెలుగు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినూత్న, ఉత్కంఠభరితమైన కార్యక్రమాలు, సీరియల్స్తో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఇటీవలే ఆట డ్యాన్స్ రియాలిటీ షో సరికొత్త సీజన్ను ఘనంగా ప్రారంభించింది.
అద్భుత ప్రదర్శనలతో

కొత్త మలుపులు, స్టార్ గెస్ట్లు, అద్భుత ప్రదర్శనలతో ఆట డ్యాన్స్ రియాలిటీ షో న్యూ సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ వారం మరిన్ని ట్విస్ట్లు, సర్ప్రైజ్లతో వచ్చేస్తున్న ఆట డ్యాన్స్ షో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.
48 గంటలకు ముందు జీ5లో
అయితే, టీవీ ప్రసారానికి 48 గంటల ముందే గురు, శుక్రవారాల్లో జీ5 ఓటీటీలో కొత్త ఎపిసోడ్లు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. అంటే టీవీతోపాటు ఓటీటీలోనూ ఆట డ్యాన్స్ రియాలిటీ షోను ఎంచక్కా చూసేయొచ్చు. ఇకపోతే ఆట సరికొత్త సీజన్కి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
నలుగురు మెంటార్స్, 16 మంది పోటీదారులు
ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ సీరియల్ హీరోయిన్ కావ్య, బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ, నటుడు వంశీ, సింగర్ సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.
జడ్జ్గా రఘు మాస్టర్
అయితే, వీరితో కూడిన జడ్జ్ ప్యానల్లో ఈ వారం నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కూడా చేరుతున్నారు. అంతేకాదు, ఈ వారం ప్రేక్షకులకు మరిన్ని సర్ప్రైజ్లు ఉండనున్నాయి.
మెగా కోడలు సందడి
{{/usCountry}}అయితే, వీరితో కూడిన జడ్జ్ ప్యానల్లో ఈ వారం నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కూడా చేరుతున్నారు. అంతేకాదు, ఈ వారం ప్రేక్షకులకు మరిన్ని సర్ప్రైజ్లు ఉండనున్నాయి.
మెగా కోడలు సందడి
{{/usCountry}}మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆట షోలో సందడి చేయనున్నారు. సీనియర్ హీరోయిన్ రంభ ఈ వారం స్పెషల్ జడ్జిగా వ్యవహరించనున్నారు. హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ వారం షోకి స్పెషల్ గెస్టులుగా హాజరై ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ వారం ఎపిసోడ్స్
ఈ వారం ఎపిసోడ్లో ఉత్కంఠభరితమైన పోటీ, అద్భుతమైన ప్రదర్శనలతోపాటు కామెడీ పంచ్లు, సరదా సంభాషణలు కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఈ వారాంతం ఎపిసోడ్స్ను ని మీరూ మిస్ కాకుండా చూసేయండి అంటూ జీ తెలుగు తాజాగా ప్రకటించింది.
అదనపు అట్రాక్షన్
ఇదిలా ఉంటే, ఆట డ్యాన్స్ రియాలిటీ షో సరికొత్త సీజన్లో మెగా డాటర్, మెగా కోడలు ఇద్దరు ఒకే వేదికపై సందడి చేయనున్నారు. వదినమరదలు అయిన లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల బుల్లితెర వైదికపై కలిసి కనిపించడం మెగా ఫ్యాన్స్తోపాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మంచి ట్రీట్ కానుంది. వీరితోపాటు సీనియర్ గ్లామర్ హీరోయిన్ రంభ కూడా చేరడం అదనపు అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు.