రెండు పార్ట్స్గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాహుబలి సిరీస్ ఒక్క మూవీగా మారి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి ది ఎపిక్ చిత్రాన్ని అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నా విషయం తెలిసిందే.
3 రోజెస్ మరో ట్రెండ్

అయితే, రెండు పార్ట్స్గా రిలీజ్ అయిన సినిమాలు ఒక్కటిగా మారుతున్న ఈ ట్రెండ్లో తాజాగా 3 రోజెస్ సిరీస్ మరో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇదివరకే ఓటీటీ వెబ్ సిరీస్గా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఒక్క మూవీగా మారి డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ఓటీటీ సినిమాగా
అవును, వెబ్ సిరీస్ అయిన త్రీ రోజెస్ ఒకే చిత్రంగా ఓటీటీ సినిమాగా ఆడియెన్స్ ముందుకు ఇవాళ (అక్టోబర్ 23) స్ట్రీమింగ్కు వచ్చేసింది. 2021లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన త్రీ రోజెస్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ముగ్గురు స్టార్ హీరోయిన్లు ముద్దులాటలు, డబుల్ మీనింగ్ డైలెగ్స్తో బోల్డ్ కామెడీ సిరీస్గా ఆకట్టుకుంది.
ముగ్గురు బ్యూటిపుల్ హీరోయిన్స్
బ్యూటిఫుల్ హీరోయిన్స్ పాయల్ రాజ్పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 3 రోజెస్ సిరీస్కు రవి నంబూరి కథ అందించగా.. మ్యాగీ దర్శకత్వం వహించారు. స్టార్ డైరెక్టర్ మారుతి క్రియేటర్గా వ్యవహరించారు. ఈ సిరీస్ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) నిర్మించారు.
8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్
3 రోజెస్ ఓటీటీ సిరీస్లో ముగ్గురు హీరోయిన్లతోపాటు వైవా హర్ష, ప్రిన్స్ సెసిల్, సాయి రోనక్, సత్యం రాజేష్, మ్యాడ్ హీరో సంగీత్ శోభన్, సౌరభ్ దింగ్రా ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమారు 29 నుంచి 39 నిమిషాల రన్టైమ్తో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న 3 రోజెస్ సిరీస్ను మూవీగా మలిచారు మేకర్స్.
2 గంటల 14 నిమిషాల రన్టైమ్
{{/usCountry}}3 రోజెస్ ఓటీటీ సిరీస్లో ముగ్గురు హీరోయిన్లతోపాటు వైవా హర్ష, ప్రిన్స్ సెసిల్, సాయి రోనక్, సత్యం రాజేష్, మ్యాడ్ హీరో సంగీత్ శోభన్, సౌరభ్ దింగ్రా ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమారు 29 నుంచి 39 నిమిషాల రన్టైమ్తో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న 3 రోజెస్ సిరీస్ను మూవీగా మలిచారు మేకర్స్.
2 గంటల 14 నిమిషాల రన్టైమ్
{{/usCountry}}రెండు గంటల 14 నిమిషాల రన్టైమ్తో త్రీ రోజెస్ మూవీగా ఓటీటీ రిలీజ్ అయింది. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆహాలోనే 3 రోజెస్ ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి ఆహాలో సిరీస్తోపాటు త్రీ రోజెస్ మూవీ కూడా ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. అంటే, అటు సిరీస్, ఇటు సినిమా రెండు ఆహా ఓటీటీలో అలరించనున్నాయి.
3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ
మరి ఇప్పటివరకు త్రీ రోజెస్ సిరీస్ను చూడనివాళ్లు మూవీగా ఎంచక్కా వీక్షించవచ్చు. ఇదిలా ఉంటే, రీసెంట్గానే త్రీ రోజెస్ సీజన్ 2ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలో 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని ఆహా ప్రకటించింది. అయితే, ఈ సెకండ్ సీజన్లో హీరోయిన్లు, డైరెక్టర్, రచయిత మారిపోయారు.
మారినవాళ్లు
3 రోజెస్ సీజన్ 2లో ఈషా రెబ్బాతోపాటు కొత్తగా హీరోయిన్ రాశి సింగ్, సోషల్ మీడియా స్టార్ కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక త్రీ రోజెస్ 2కి రవి నంబూరితోపాటు సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహిస్తున్నారు.