...
...
Next Story

OTT Free: ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్స్- సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు! ఎక్కడంటే?

Top 5 OTT Crime Thrillers Free: ఓటీటీలో మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్స్‌ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, వీటిని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ (Subscription) లేకుండా ఉచితంగా ఓటీటీలో చూసేయొచ్చు. మరి ఆ ఓటీటీ ఏంటీ, ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 9, 2026, 21:03:56 IST
Advertisement

Top 5 OTT Crime Thrillers Free: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలనే. మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు, క్షణం క్షణం ఉత్కంఠ రేపే సన్నివేశాలు ఉంటే ఆ కిక్కే వేరు. అయితే రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా ప్రైమ్ కంటెంట్‌ను ఉచితంగా చూడగలిగితే అంతకంటే కావలసిందేముంది?

ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్స్- సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు! ఎక్కడంటే?
ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్స్- సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు! ఎక్కడంటే?

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) తమ వినియోగదారులకు అలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించగలిగే ఐదు పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. మిథ్య (Mithya)

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలను ఇష్టపడేవారికి 'మిథ్య' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జూహి, ఆమె వద్ద చదివే విద్యార్థిని రియా మధ్య జరిగే మైండ్ గేమ్‌ ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. రియా తన అసైన్‌మెంట్‌లో కాపీ కొట్టిందని ప్రొఫెసర్ ఆరోపించడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది.

ఆ ఆరోపణను మనసులో పెట్టుకున్న విద్యార్థిని రియా, టీచర్‌పై పగ తీర్చుకోవడానికి ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టేందుకు సిద్ధపడుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుని మొత్తం 12 ఎపిసోడ్లతో ప్రేక్షకులను జీ5 ఓటీటీలో అలరిస్తోంది. దీనిని ఉచితంగా వాచ్ చేయొచ్చు.

2. అపరిచితుడు (Anniyan / Aparichithudu)

ఐఎమ్‌డీబీ (IMDb) లో 8.4 రేటింగ్ సాధించిన ఈ ఎవర్ గ్రీన్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటికీ ప్రేక్షకులను మైమరిపిస్తుంది. జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న అపరిచితుడు సినిమాను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఇప్పుడు ఫ్రీగా చూడొచ్చు.

3. టేబుల్ నెంబర్ 21 (Table No. 21)

2013లో విడుదలైన ఈ చిత్రం కాలేజీలలో జరిగే ర్యాగింగ్ ఎంతటి దారుణాలకు దారితీస్తుందో కళ్లకు కడుతుంది. పరేష్ రావల్, రాజీవ్ ఖండేల్వాల్, టీనా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, ఒక తండ్రి తన కొడుకుపై జరిగిన దారుణమైన ర్యాగింగ్‌కు ఎలా పగ తీర్చుకున్నాడో ఊహించని మలుపులతో చూపెట్టారు.

7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ టేబుల్ నెంబర్ 21 సినిమా చివరి వరకు ప్రేక్షకులను కుర్చీల అంచులపై కూర్చోబెడుతుంది. జీ5లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ మూవీనీ ఎంచక్కా ఫ్రీగా చూడొచ్చు.

4. వేద (Vedha)

2022లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ అండ్ రివేంజ్ చుట్టూ తిరుగుతుంది. తమ జీవితాన్ని నాశనం చేసిన శత్రువులపై తండ్రీకూతుళ్లు కలిసి పగ తీర్చుకునే క్రమంలో వరుస హత్యలకు పాల్పడతారు.

ఈ దారుణమైన హత్యలను అడ్డుకోవడానికి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 6.7 రేటింగ్ లభించింది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన వేద సినిమాను జీ5 ఓటీటీలో ఫ్రీగా వాచ్ చేయొచ్చు.

5. భైరవం (Bhairavam)

చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఒక రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఎలా చిచ్చు పెట్టాడనే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం 'భైరవం'. గుడిలోని పురాతన ఖజానాను హస్తగతం చేసుకోవడానికి ఒక మంత్రి వేసే వ్యూహాలు, ఆ ఇద్దరి మిత్రుల జీవితాలను ఎలా మార్చేశాయో ఇందులో చూడవచ్చు.

కథనంలో వచ్చే ట్విస్టులు చివరి దాకా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన భైరవంను జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe