Veerabhadruni Rahasyam 2 OTT Release: డిజిటల్ వినోద ప్రపంచంలో తెలుగు ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' సరికొత్త మైలురాయిని చేరుకుంది. జీ5 (ZEE5) ప్లాట్ఫామ్పై ప్రసారమవుతున్న ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మొదటి భాగం బంపర్ హిట్ సాధించింది.
ఓటీటీలోకి వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 కూడా

ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ ఆదరణతో ఇప్పుడు వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. తాజాగా వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం డిజిటల్ కంటెంట్లో సస్పెన్స్, దైవిక అంశాలతో కూడిన మిస్టరీ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అదే కోవలో లాంగ్ ఫార్మాట్లో రూపుదిద్దుకున్న 'వీరభద్రుని రహస్యం' వీక్షకులను కట్టిపడేస్తోంది. మొదటి భాగంలో ప్రసారమైన 30 ఎపిసోడ్లు ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి.
300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్తో సంచలనం
వీరభద్రుని రహస్యం సీజన్ 1 ఓటీటీ రిలీజ్ అయిన అతి స్వల్ప కాలంలోనే ఏకంగా 300 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదు చేసి, ఈ ఏడాది డిజిటల్ స్పేస్లో అత్యధికంగా చూసిన లాంగ్ ఫార్మాట్ వెబ్ సిరీస్గా రికార్డు సృష్టించింది.
ఇకపై ప్రతివారం 5 ఎపిసోడ్లు
ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ మేకర్స్ కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలోకి వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ పార్ట్ 2లో ప్రతి వారం బుధవారం రోజున ఏకంగా 5 ఎపిసోడ్లను ఒకేసారి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.
దీనికి సంబంధించిన సరికొత్త వీరభద్రుని రహస్యం పార్ట్ 1 ట్రైలర్ను శుక్రవారం (సెప్టెంబర్ 4) విడుదల చేశారు. 90ల కాలంలో బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సీరియల్ 'మర్మదేశం' తరహాలో ఈ సిరీస్ను రీ-క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అదృశ్య శక్తులు, రహస్యాల చుట్టూ తిరిగే ఈ కథనాన్ని దర్శకుడు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి ఎంతో ఆసక్తికరంగా మలిచారు.
ఓటీటీ సిరీస్పై ప్రశంసలు
{{/usCountry}}దీనికి సంబంధించిన సరికొత్త వీరభద్రుని రహస్యం పార్ట్ 1 ట్రైలర్ను శుక్రవారం (సెప్టెంబర్ 4) విడుదల చేశారు. 90ల కాలంలో బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సీరియల్ 'మర్మదేశం' తరహాలో ఈ సిరీస్ను రీ-క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అదృశ్య శక్తులు, రహస్యాల చుట్టూ తిరిగే ఈ కథనాన్ని దర్శకుడు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి ఎంతో ఆసక్తికరంగా మలిచారు.
ఓటీటీ సిరీస్పై ప్రశంసలు
{{/usCountry}}ఈ ఓటీటీ సిరీస్ సాధించిన విజయానికి సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాత నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "కి మీడిగయా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కల్కి రాజా నిర్మించిన ఈ సిరీస్ అందరినీ అలరిస్తోంది. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన షో ఇది" అని పేర్కొన్నారు.
"జీ5 సమర్పణలో కల్కి రాజా నిర్మించిన 'వీరభద్రుని రహస్యం' అద్భుతంగా ఉంది. ప్రతీ వారం వస్తున్న ఎపిసోడ్లు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. 90వ దశకంలో ఆకట్టుకున్న 'మర్మదేశం' సీరియల్ను మళ్లీ చూస్తున్న భావన కలిగింది. థ్రిల్ కోరుకునే వారు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది" అని మెగా బ్రదర్ నాగబాబు కొనియాడారు.
కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో?
ఇదిలా ఉంటే, ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్లో రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 9న జీ5 ఓటీటీలోకి రానున్న వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఎపిసోడ్లలో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.