AIIMS Recruitment 2025 : మంగళగిరి ఎయిమ్స్లో ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా...
ఏపీ మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 8 ఖాళీలున్నాయి. నవంబర్ 11వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్), అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్, లా ఆఫీసర్ తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని కలిపి 8 ఖాళీలున్నాయి.

అప్లికేషన్ల తుది గడువు…
ప్రస్తుతం ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు నవంబర్ 11వ తేదీతో ముగుస్తుంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన వర్శిటీల నుంచి డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంసీఏ/బీఎస్సీ, LLB లో ఉత్తీర్ణత పొందినవాళ్లు అర్హులవుతారు. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద కొన్ని పోస్టులకు రూ. 1500, మరికొన్ని పోస్టులకు రూ. 1000గా నిర్ణయించారు.
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేవారి వయసు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. పోస్టును బట్టి జీతం ఉంటుంది. సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్)కు నెలకు రూ.1,04,935గా ఉండగా…లా ఆఫీసర్ కు రూ.86,955గా ఉంది. బయో-మెడికల్ ఇంజినీర్ కు రూ.69,595, శానిటరీ ఇన్స్పెక్టర్ కు రూ.54,870గా నిర్ణయించారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.54,870.అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కు రూ.54,870 జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్…
- అభ్యర్థులు ముందుగా https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో రిక్రూట్ మెంట్ సెక్షన్ లోని Vacancies ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ నాన్ ఫ్యాకల్టీ క్యాటరిగిలో నోటిఫికేషన్ ఉంటుంది.చివర్లో ఉండే అప్లయ్ నౌ ఆప్షన్ పై నొక్కాలి.
- మీ వివరాలను నమోదు చేసి చివరగా సబ్మిట్ చేయటంతో ప్రాసెస్ పూర్తవుతుంది.
- మీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఈ హార్డ్ కాపీని “రిక్రూట్ మెంట్ సెంల్, రూమ్ నెంబర్ 205, 2వ ఫ్లోర్, అడ్మిన్ లైబ్రరీ భవనం, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు(జిల్లా), ఆంధ్రప్రదేశ్ - 522503” చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే recruitment.helpdesk@aiimsmangalagiri.edu.in కు మెయిల్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

