...
...
Next Story

Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌కి ప్రతిరూపం- ఆ వ్యాధి వల్ల సినిమాలకు దూరం- ఓటీటీతో రీ ఎంట్రీ- స్నేహా ఉల్లాల్ ఏం చేస్తోందంటే?

Sneha Ullal Comparisons With Aishwarya Rai: సల్మాన్ ఖాన్ సరసన 'లక్కీ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఐశ్వర్య రాయ్ పోలికలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యూటి స్నేహా ఉల్లాల్. ఆ వ్యాధి కారణంగా సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ, సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Published on: May 10, 2026, 06:55:53 IST
Advertisement

Sneha Ullal Comparisons With Aishwarya Rai And Re Entry: 2000వ దశకం మధ్యలో భారతీయ సినీ పరిశ్రమలో ఒక పేరు మార్మోగిపోయింది. ఆ పేరే స్నేహా ఉల్లాల్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' సినిమాతో స్నేహ ఉల్లాల్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది.

ఐశ్వర్య రాయ్‌కి ప్రతి రూపం

ఐశ్వర్య రాయ్‌కి ప్రతిరూపం- ఆ వ్యాధి వల్ల సినిమాలకు దూరం- ఓటీటీతో రీ ఎంట్రీ- స్నేహా ఉల్లాల్ ఏం చేస్తోందంటే?
ఐశ్వర్య రాయ్‌కి ప్రతిరూపం- ఆ వ్యాధి వల్ల సినిమాలకు దూరం- ఓటీటీతో రీ ఎంట్రీ- స్నేహా ఉల్లాల్ ఏం చేస్తోందంటే?

దానికి కారణం కేవలం సల్మాన్ ఖాన్ సినిమా కావడం మాత్రమే కాదు.. అప్పట్లో స్నేహా ఉల్లాల్ అచ్చం స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ లాగే ఉండటం. మీడియాలో, ప్రేక్షకుల్లో స్నేహా ఉల్లాల్‌ను అంతా ఐశ్వర్య రాయ్‌కి ప్రతి రూపం (లుక్ ఎలైక్) అని పిలవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ పోలికల వలయం నుంచి బయటపడి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి స్నేహా ఉల్లాల్ గట్టిగానే కృషి చేసింది.

కాలేజీ అమ్మాయి నుంచి సెన్సేషన్ వరకు

స్నేహా ఉల్లాల్ నిజానికి నటి కావాలని ఎప్పుడూ కలగనలేదట. కాలేజీలో చదువుకుంటున్న సమయంలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ ద్వారా ఆమెకు సినీ రంగంతో పరిచయం ఏర్పడింది. అప్పటికే సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా కోసం ఒక సరికొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. స్నేహాలోని అమాయకత్వం, ఐశ్వర్య రాయ్‌ను పోలి ఉండే ఆమె కళ్లు సల్మాన్‌ను ఆకట్టుకున్నాయి. దాంతో హీరోయిన్‌గా స్నేహాకు అవకాశం వచ్చింది.

లక్కీ సినిమా విడుదలయ్యాక స్నేహాపై వచ్చిన కథనాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలోనే తనకు, ఐశ్వర్య రాయ్‌కు మధ్య ఉన్న పోలికల వల్ల ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని భయపడినట్లు స్నేహా ఉల్లాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సారీ, నన్ను ద్వేషించకండి

బాలీవుడ్‌లో వరుస పోలికల వల్ల తన సొంత గుర్తింపు దెబ్బతింటోందని భావించిన స్నేహా ఉల్లాల్ తన మకాంను దక్షిణాదికి మార్చింది. 2008లో వచ్చిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆమెను అమితంగా ఆదరించారు.

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన 'సింహా' (2010) వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది స్నేహా ఉల్లాల్. అవే కాకుండా కరెంట్, మడత కాజా, మంచు మనోజ్ నేను మీకు తెలుసా, అంతా నీ మాయలోనే వంటి సినిమాల్లో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది. నాగార్జున కింగ్, నాని అలా మొదలైంది, అల్లరి నరేష్ యాక్షన్ 3డీ సినిమాల్లో గెస్ట్ అప్పిరియన్స్ కూడా ఇచ్చింది స్నేహా ఉల్లాల్.

అనారోగ్యం వల్ల దూరం

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే స్నేహ ఉల్లాల్ అదృశ్యమైంది. దీనికి కారణం స్నేహా ఉల్లాల్‌కు సోకిన 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'. ఈ వ్యాధి వల్ల ఆమె తీవ్రమైన నీరసానికి గురయ్యేవారు. గంటల తరబడి షూటింగ్‌లలో పాల్గొనడం ఆమెకు అసాధ్యంగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలకు విరామం ప్రకటించి, తన ఆరోగ్యంపై దృష్టి సారించింది.

ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ ఏం చేస్తోంది?

కొన్నేళ్ల విరామం తర్వాత స్నేహా ఉల్లాల్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతోంది. అయితే గతంలోలా కేవలం గ్లామర్ పాత్రల వెంట పడకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. 2020లో 'ఎక్స్‌పైరీ డేట్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో మెరిసింది.

మళ్లీ తెలుగు తెరపైకి

2025లో 'సాకో 363'లో భాగమైన స్నేహా ఉల్లాల్, రీసెంట్‌గా తెలుగులో 'నీలకంఠ' (2026) సినిమాతో మళ్లీ తెలుగు తెరపైకి పునరాగమనం చేసింది. ఇప్పుడు స్నేహా ఉల్లాల్ తన జీవితాన్ని చాలా ప్రశాంతంగా, లో-ప్రొఫైల్‌లో గడుపుతూ మంచి కథల కోసం ఎదురుచూస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe