Zee5 OTT Release Movies New Balakrishna To Allari Naresh: డిజిటల్ వినోద ప్రపంచంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా జీ5 (ZEE5) ఓటీటీ సరికొత్త ఎంటర్టైన్మెంట్కు శ్రీకారం చుట్టింది. దక్షిణాది ఆడియెన్స్ మనసు దోచుకునే నెటివిటీ కథలతో, స్టార్ హీరోల భారీ చిత్రాలతో సరికొత్త కంటెంట్ లైనప్ను మార్కెట్లోకి తీసుకురానుంది జీ5 ఓటీటీ సంస్థ.
ఇంటర్నేషనల్ స్థాయిలో కథలు

నాణ్యమైన కంటెంట్ను ఆదరించే తెలుగు ఆడియెన్స్ కోసం ప్రాంతీయ మూలాలను కాపాడుకుంటూనే, అంతర్జాతీయ స్థాయిలో కథలను అందించేలా ఈ సరికొత్త ఓటీటీ సినిమాల వ్యూహాన్ని రచించింది.
స్టార్ హీరోల చిత్రాలతో ఓటీటీలో రచ్చ
ఓటీటీ ప్రేమికులను థ్రిల్ చేసేలా దిగ్గజ హీరోల సినిమాలను జీ5 తమ ఖాతాలో వేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'ఎన్బీకే111' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ను చేజిక్కించుకుంది. అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ కలసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జనవరి 12 విడుదల' కూడా ఈ జాబితాలో ఉంది.
అక్కినేని హీరోలు అఖిల్ నటించిన 'లెనిన్' (దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు), దళపతి విజయ్ జన నాయగన్ ఈపాటికే జీ5లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నాగచైతన్య-మీనాక్షి చౌదరిల హారర్ థ్రిల్లర్ 'వృషకర్మ' (దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు) కూడా జీ5 ఓటీటీలోకే అలరించడానికి వచ్చేయనుంది.
కనక దుర్గ నుంచి వీరప్పన్ 2 వరకు
ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న 'కనక దుర్గ' ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. వీటితో పాటు 'హాయ్', 'డిమాంటీ కాలనీ 2', 'ఏ క్వీన్', 'వీరప్పన్ 2' వంటి సూపర్ హిట్ డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.
టాప్ బ్యానర్లు.. ఆకట్టుకునే ఒరిజినల్స్
{{/usCountry}}ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న 'కనక దుర్గ' ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. వీటితో పాటు 'హాయ్', 'డిమాంటీ కాలనీ 2', 'ఏ క్వీన్', 'వీరప్పన్ 2' వంటి సూపర్ హిట్ డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.
టాప్ బ్యానర్లు.. ఆకట్టుకునే ఒరిజినల్స్
{{/usCountry}}అయితే, పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో జీ5 చేతులు కలిపింది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్, మనం ఎంటర్ప్రైజెస్, బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్, ఉదయ భాను ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లతో కలిసి కంటెంట్ సిద్ధం చేసింది.
ఒరిజినల్ ఓటీటీ సిరీస్ విభాగంలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో 'శ్రీమతి', భరత్ నివాస్, శివాజీ రాజా, ఉదయభాను నటించిన 'పంచనామా' సిరీస్లు రాబోతున్నాయి. వర్సటైల్ నటుడు జగపతి బాబు హోస్ట్గా 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో సరికొత్త టాపిక్స్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
విప్లవాత్మక ఏఐ కథలు.. లైవ్ స్పోర్ట్స్ ధమాకా
సాంకేతికతను జోడిస్తూ ఏఐ (AI) ఆధారిత స్టోరీ టెల్లింగ్తో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్. 'గరుడ', 'విక్రమ్ బేతాళ్', 'శివ్ సతి', 'చంద్రకాంత', 'తిరుపతి బాలాజీ', 'నర్మద', 'రామ్ ఆంజనేయ యుద్ధ్' వంటి పురాణ, జానపద కథలను ఏఐ సాంకేతికతతో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
పిల్లల కోసం 'బార్బరీక్', 'కుండక మండక్క' వంటి వినోదాత్మక కంటెంట్తో పాటు, క్రీడాభిమానుల కోసం ఫిఫా (FIFA), బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్టీ20 (ILT20) వంటి లైవ్ స్పోర్ట్స్ ప్రసారాలను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎమోషన్స్కు దగ్గరుండే కథలు
"తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కొత్తదనంతో పాటు భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను ఆదరిస్తారు. క్రియేటర్స్, ప్రొడక్షన్ హౌస్లతో ఏర్పడిన బంధంతో ఈ లైనప్ రూపొందించాం. వైవిధ్యమైన, ధైర్యమైన కథలను అందించడమే మా లక్ష్యం" అని జీ5 ఓటీటీ సౌత్ బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ స్పష్టం చేశారు.