Adivi Sesh Dacoit: ఆ సినిమా వల్లే డెకాయిట్ రిలీజ్ వాయిదా వేశాం.. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా: అడివి శేష్
Adivi Sesh Dacoit: డెకాయిట్ మూవీ రిలీజ్ వెనుక కారణం ధురంధర్ 2నే అని అడివి శేష్ కన్ఫమ్ చేశాడు. ఆ సినిమాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే కదా అని అతడు అనడం విశేషం. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' (Dacoit) విడుదల తేదీ మారడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని మూవీ టీమ్ భావించినప్పటికీ, తాజాగా ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణాన్ని అడివి శేష్ స్వయంగా వెల్లడించాడు.

థియేటర్ల సమస్య వల్లే ఈ నిర్ణయం
బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ.. 'ధురంధర్ 2' (Dhurandhar 2) సినిమా ప్రభావం వల్లే తాము వెనక్కి తగ్గామని నిజాయితీగా అంగీకరించాడు.
"మార్చి 19న ధురంధర్ 2 విడుదలవుతోంది. ఆ సినిమాతో పోటీ పడితే మాకు కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయనే భరోసా లేదు. అందుకే ప్రాక్టికల్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన వివరించాడు.
కంటెంట్పై నమ్మకం ఉంది కానీ..
'ధురంధర్ 2' మీ సినిమాపై ఎంతమేర ప్రభావం చూపింది? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. "కంటెంట్ పరంగా మా సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ రిలీజ్ పరంగా ఆ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 'డెకాయిట్' అనేది యాక్షన్ రిథమ్లో సాగే ఒక లోతైన భావోద్వేగపూరితమైన ప్రేమకథ. అయితే 'ధురంధర్ 2' దేశంలోనే అతిపెద్ద సినిమా. దానికి తగిన గౌరవం ఇవ్వాలి. మంచి థియేటర్లు, షోలు దక్కించుకోవడమే మా లక్ష్యం. అందుకే తేదీని మార్చాం" అని స్పష్టం చేశాడు.
అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద సినిమాలతో అనవసర పోటీ కంటే, తమ సినిమాకు సరైన థియేటర్లు దొరికేలా చూసుకోవడమే ఉత్తమమని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారు.
డెకాయిట్ మూవీ గురించి..
డెబ్యూ డైరెక్టర్ షనీల్ డియో దర్శకత్వం వహించిన డెకాయిట్ మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో మాజీ ప్రేమికులైన ఇద్దరు వ్యక్తులు కొన్ని దొంగతనాలు చేయాల్సి వస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి 'టైమ్స్ నౌ'తో అడివి శేష్ మాట్లాడుతూ.. డెకాయిట్ ను ఆధునిక ‘షోలే’ మూవీ అని పిలిచాడు. ‘‘ఇది చాలా ఎమోషనల్, ఆవేశంతో కూడిన కథ. డెకాయిట్ లో నవ్వు, కోపం, కన్నీళ్లు.. ఇలా సినిమాల్లో ఉండాల్సిన ప్రతి ఎమోషన్ ఉంటుంది’’ అని అడివి శేష్ చెప్పాడు.
అటు ధురంధర్ 2 దెబ్బకు టాక్సిక్ మూవీ కూడా రిలీజ్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. పెద్ది, పారడైజ్ లాంటి మూవీస్ కూడా తప్పుకున్నాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తన రిలీజ్ ను ముందుకు జరిపి ధురంధర్ 2కి పోటీగా నిలబెట్టడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












