ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్.. ఐఎండీబీలో 8.8 రేటింగ్
ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది.
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ వస్తోంది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉండటం విశేషం. బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ లాంటి నటులు ఇందులో నటించారు.

కర్మణ్యే వాధికారస్తే ఓటీటీ స్ట్రీమింగ్
తెలుగులో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కర్మణ్యే వాధికారస్తే. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (నవంబర్ 21) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. “కర్మణ్యే వాధికారస్తే రేపు వస్తోంది. చాలా లోతుగా మనసును తాకే స్టోరీ కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ను పోస్ట్ చేసింది.
కర్మణ్యే వాధికారస్తే మూవీ గురించి..
కర్మణ్యే వాధికారస్తే సినిమాను అమర్దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేశాడు. ఇందులో ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్, పృథ్వీరాజ్, శివాజీ రాజాలాంటి వాళ్లు నటించారు. జ్ఞాని మ్యూజిక్ అందించాడు. ఉషస్విని ఫిల్మ్స్ మూవీని నిర్మించింది. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం 8.8 రేటింగ్ నమోదైంది.
ఆయుధాల అక్రమ రవాణా, గూఢచర్యం గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొందరు అధికారుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సస్పెన్షన్ కు గురైన ఎన్ఐఏ ఏజెంట్, ఓ ఏసీపీ, ఓ కానిస్టేబుల్ కలిసి ఈ ఇన్వెస్టిగేట్ చేస్తారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాని ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇదే సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (నవంబర్ 21) నుంచి తమిళ సినిమా డీజిల్, కన్నడ మూవీ ఉసిరు కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఇక ఇప్పటికే ఎక్కా, దండకారణ్యంలాంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


