ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ : ఇవాళ్టి నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - ముఖ్య తేదీలివే

ఇవాళ్టి నుంచి ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ గడువు 14వ తేదీతో పూర్తవుతుంది. జూలై 19వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

Published on: Jul 10, 2025, 09:25:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ఐసెట్ - 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. జూలై 14వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత జూలై 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఈ గడువు జూలై 16వ తేదీతో పూర్తవుతుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి.

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ - 2025
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ - 2025

జూలై 19న సీట్ల కేటాయింపు…

జూలై 11 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.జూలై 17వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. జూలై 19వ తేదీన ఐసెట్ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 20వ తేదీ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు జూలై 22వ తేదీతో పూర్తవుతుంది. రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. జూలై 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://cets.apsche.ap.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ - కావాల్సిన పత్రాలు

  • ఏపీ ఐసెట్ హాల్ టికెట్
  • ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డు
  • టీసీ
  • డిగ్రీ మెమో
  • డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
  • ఇంటర్ మెమో
  • పదో తరగతి మెమో
  • స్టడీ సర్టిఫికెట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్ కార్జు
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఈడబ్యూఎస్ ధ్రువీకరణపత్రం
  • స్థానికత సర్టిఫికెట్ తో పాటు ఇతర పత్రాలు

ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2025 నిర్వహించారు. మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మే 20 వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీ చేపట్టింది. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ ఈ లింక్ లో తెలుసుకోవచ్చు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…. 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More