UCO Bank Recruitment : యూకో బ్యాంక్లో అప్రెంటీస్ పోస్టులు- ఎంపిక ప్రక్రియ ఇలా..
యూకో బ్యాంక్ అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా సంస్థలోని అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ, వయస్సు పరిమితి సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూకో బ్యాంక్ నుంచి నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్లో ఖాళీగా ఉన్న 532 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది బ్యాంక్. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ucobank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యూకో బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025- ముఖ్యమైన తేదీలు..
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 21, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2025
- ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 532 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాల అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
యూకో బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025- నోటిఫికేషన్లోని వివరాలు..
అర్హత ప్రమాణాలు-
1. విద్యార్హత: దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలు ఆమోదించిన, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.అభ్యర్థి తమ గ్రాడ్యుయేషన్ 01.04.2021 తేదీన లేదా ఆ తర్వాత పూర్తి చేసి ఉండాలి.గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్లు, ప్రొవిజనల్/ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.
2. వయోపరిమితి: యూకో బ్యాంక్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థి వయస్సు 01.10.2025 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.అంటే, అభ్యర్థి 02.10.1997 కంటే ముందు, 01.10.2005 తర్వాత జన్మించి ఉండకూడదు (ఈ రెండు తేదీలు కలిపి).
రిజర్వేషన్ ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
3. ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
ఆన్లైన్ టెస్ట్: ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. గరిష్ట మార్కులు: 100పరీక్ష సమయం: 1 గంట (60 నిమిషాలు)పరీక్ష మాధ్యమం: ఇంగ్లీష్ లేదా హిందీ.
మెరిట్ లిస్ట్: ఆన్లైన్ టెస్ట్లో సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు, వారు రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా, ఆయా రాష్ట్రాలు, కేటగిరీలలో అవరోహణ క్రమంలో స్థానం కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు- రూ. 800/-
దివ్యాంగుల (పీడబ్ల్యూబీడీ) కేటగిరీ అభ్యర్థులకు: రూ. 400/-
దరఖాస్తు ఫీజును కేవలం ఆన్లైన్ పద్ధతిలో చెల్లించాలి.
మరిన్ని వివరాలు, సందేహాల కోసం అభ్యర్థులు యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


