Sign in

Ikka Trailer: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. 30 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ట్రైలర్ రిలీజ్

Ikka Trailer: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో సూపర్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా స్ట్రీమింగ్ కు రాబోతోంది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా నటించిన ఇక్కా మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. జులై 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jun 29, 2026, 19:22:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ikka Trailer: బాలీవుడ్ యాక్షన్ లెజెండ్ సన్నీ డియోల్, వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’ అఫీషియల్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ సోమవారం (జూన్ 29) రిలీజ్ చేసింది. ఐకానిక్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘బోర్డర్’ తర్వాత దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ గ్యాప్ అనంతరం ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ లీగల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Ikka Trailer: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. 30 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ట్రైలర్ రిలీజ్
Ikka Trailer: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. 30 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ట్రైలర్ రిలీజ్

కోర్టులో సన్నీ డియోల్ వర్సెస్ తిలోత్తమ షోమ్..

హిట్ మూవీ ‘హిచ్కీ’ ఫేమ్ డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ డ్రామాలో సన్నీ డియోల్ అజేయుడైన లాయర్ అర్జున్ మెహ్రా క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొదట్లోనే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ శౌర్యమన్ గౌర్ ఒక హత్యా ప్రయత్నం కేసులో దారుణంగా ఇరుక్కుంటాడు.

తనను కాపాడటం కోసం సన్నీ డియోల్‌తో అక్షయ్ ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకుంటాడు. అసలు ఆ డీల్ ఏంటి? ఎప్పుడూ ఓటమి ఎరుగని సన్నీ డియోల్ ఈ కేసును ఎందుకు టేకప్ చేశాడు అనే పాయింట్ చుట్టూ కథను చాలా సస్పెన్స్‌గా నడిపించారు.

దియా మీర్జా ఎమోషనల్ రోల్..

ఇక కోర్టు సీన్లలో సన్నీ డియోల్‌కు ప్రత్యర్థి ప్రాసిక్యూటింగ్ లాయర్‌గా అతని పాత స్టూడెంట్ తిలోత్తమ షోమ్ గట్టి పోటీ ఇస్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. వీరిద్దరి మధ్య జరిగే కోర్ట్ రూమ్ వార్ సీన్లు, ఇంటెన్స్ డైలాగ్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి. మరోవైపు గ్లామర్ బ్యూటీ దియా మీర్జా ఈ కేసు వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే ఒక మధ్యతరగతి భార్య, తల్లి క్యారెక్టర్‌లో చాలా ఎమోషనల్‌గా కనిపించింది. ఈ సినిమాలో సంజీదా షేక్, శిశిర్ శర్మ, ఆకాంక్ష రంజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఒక డైరెక్ట్ ఓటీటీ డిజిటల్ రిలీజ్ సినిమా చేయడంపై సన్నీ డియోల్ ముంబై ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. "ఇక్కా కేవలం ఒక నార్మల్ కోర్ట్‌రూమ్ డ్రామా మాత్రమే కాదు.. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్, లైఫ్ లో మనం తీసుకునే కఠినమైన నిర్ణయాల చుట్టూ సాగే కథ ఉంది. నా పాత్రలోని బాధ, ఆవేశం ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి" అని సన్నీ డియోల్ ధీమా వ్యక్తం చేశాడు.

జులై 10 నుండి స్ట్రీమింగ్

ముంబైలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అక్షయ్ ఖన్నా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినప్పటికీ.. ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ వాయిస్ మెసేజ్ పంపించాడు. "కొన్ని కలయికలు స్టేజ్ పైన జరగవు.. ఒకవేళ జరిగితే అక్కడ పెద్ద భూకంపమే వస్తుంది. అందుకే నేను, సన్నీ డియోల్ జులై 10న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ స్క్రీన్ పైనే కలుస్తాం.. అందరూ రెడీగా ఉండండి" అంటూ తన స్టైలిష్ వాయిస్‌తో హింట్ ఇచ్చాడు. అల్కెమీ ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ సస్పెన్స్ లీగల్ థ్రిల్లర్ జులై 10 నుండి వరల్డ్‌వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More