తెలంగాణలోనూ పెరిగిన అఖండ 2 టికెట్ల ధరలు.. ప్రీమియర్ షోకూ భారీగానే.. మూడు రోజుల పాటే..

తెలంగాణలోనూ అఖండ 2 టికెట్ల ధరలు పెరిగాయి. ఈమేరకు గురువారం (డిసెంబర్ 4) తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ పెరిగిన ధరలు తొలి మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Published on: Dec 04, 2025 4:27 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ల ధరలు ఇప్పటికే ఏపీలో పెరగగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇక్కడా మూవీ టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. తొలి మూడు రోజుల పాటు ఈ పెంచిన ధరలు అమల్లో ఉంటాయని జీవోలో తేల్చి చెప్పారు.

తెలంగాణలోనూ పెరిగిన అఖండ 2 టికెట్ల ధరలు.. ప్రీమియర్ షోకూ భారీగానే.. మూడు రోజుల పాటే..
తెలంగాణలోనూ పెరిగిన అఖండ 2 టికెట్ల ధరలు.. ప్రీమియర్ షోకూ భారీగానే.. మూడు రోజుల పాటే..

అఖండ 2 టికెట్ల ధరలు ఇలా..

తెలంగాణలో అఖండ 2 మూవీ టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుకోవడానికి అనుమతి లభించింది. దీంతో టికెట్ల ధరలు సింగిల్ స్క్రీన్లలో రూ.227కి, మల్టీప్లెక్స్ లలో రూ.395కి చేరాయి.

ఇక ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఈ పెంచిన ధరలు తొలి మూడు రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే అమల్లో ఉంటాయి. అంతేకాదు ఈ పెంచిన ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సిందేనన్న నిబంధనతో టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం.

ఏపీలో టికెట్ల ధరలు ఇలా..

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ అఖండ 2 మూవీ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు గత మంగళవారం (డిసెంబర్ 2) అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్ కు ముందు రోజు అంటే గురువారం (డిసెంబర్ 4) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోల కోసం టికెట్ల ధరను రూ.600 గా నిర్ణయించారు.

అన్ని థియేటర్లలోనూ ఇదే ధర ఉంటుంది. ఇక మూవీ రిలీజయ్యే డిసెంబర్ 5 నుంచి తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ అయితే రూ.75, మల్టీప్లెక్స్ అయితే రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధర రూ.222.50 కాగా.. మల్టీప్లెక్స్ లలో రూ.277గా ఉండనుంది.

అఖండ 2 మూవీ గురించి..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రాబోయే అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రాలాంటి వాళ్లు కూడా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.