Stock market news : నష్టాలే నష్టాలు.. ఈరోజు కూడా సూచీలు డౌన్! యుద్ధంతో ఢమాల్..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు పెరిగి 73,983 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 27 పాయింట్లు కోల్పోయి 23,215 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్లు పడి 55,100 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో ప్రంపచ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,214.98 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,123.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 175 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“గత ట్రేడింగ్ సెషన్లో 23,450 కీలక జోన్ని నిఫ్టీ50 దాటలేకపోయింది. భారీ అప్పర్ షాడోతో డోజీ తరహా క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఇది ప్రాఫిట్ బుకింగ్కి సంకేదం. ఇప్పుడు సూచీ 23,450 దాటి 23,600 వరకు వెళ్లాలంటే.. ముందు 23,200 లెవల్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ డెరివేటివ్స్ అండే టెక్నికల్స్ చందన్ తపారియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.8 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.6శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.9 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఫలితంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ 2.47శాతం వృద్ధిచెంది బ్యారెల్కి 95.40 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఏబీఎస్ఎల్ఏఎంసీ- బై రూ. 1110, స్టాప్ లాస్ రూ. 1062, టార్గెట్ రూ. 1200
రెటిగెయిన్ ట్రావెల్- బై రూ. 783, స్టాప్ లాస్ రూ. 744, టార్గెట్ రూ. 850
మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1540, స్టాప్ లాస్ రూ. 1490, టార్గెట్ రూ. 1650
రేయ్మాండ్- బై రూ. 553, స్టాప్ లాస్ రూ. 525, టార్గెట్ రూ. 600
సీసీఎల్ ప్రాడక్ట్స్- బై రూ. 1193, స్టాప్ లాస్ రూ. 1135, టార్గెట్ రూ .1290
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


