Stock market news : నష్టాలే నష్టాలు.. ఈరోజు కూడా సూచీలు డౌన్! యుద్ధంతో ఢమాల్..

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 11, 2026, 08:15:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 64 పాయింట్లు పెరిగి 73,983 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 27 పాయింట్లు కోల్పోయి 23,215 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 94 పాయింట్లు పడి 55,100 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో ప్రంపచ స్టాక్​ మార్కెట్​లు నష్టాల బాటపట్టాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,214.98 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,123.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 175 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“గత ట్రేడింగ్​ సెషన్​లో 23,450 కీలక జోన్​ని నిఫ్టీ50 దాటలేకపోయింది. భారీ అప్పర్​ షాడోతో డోజీ తరహా క్యాండిల్​ని ఫార్మ్ చేసింది. ఇది ప్రాఫిట్​ బుకింగ్​కి సంకేదం. ఇప్పుడు సూచీ 23,450 దాటి 23,600 వరకు వెళ్లాలంటే.. ముందు 23,200 లెవల్ బ్రేక్​ అవ్వకుండా చూసుకోవాలి,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్​ డెరివేటివ్స్ అండే టెక్నికల్స్​ చందన్ తపారియా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.8 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.6శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.9 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా, స్ట్రెయిట్ ఆఫ్​ హర్ముజ్​ వద్ద మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఫలితంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఫలితంగా బ్రెంట్​ క్రూడ్ 2.47శాతం వృద్ధిచెంది బ్యారెల్​కి 95.40 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఏబీఎస్​ఎల్​ఏఎంసీ- బై రూ. 1110, స్టాప్​ లాస్​ రూ. 1062, టార్గెట్​ రూ. 1200

రెటిగెయిన్ ట్రావెల్- బై రూ. 783, స్టాప్​ లాస్​ రూ. 744, టార్గెట్​ రూ. 850

మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1540, స్టాప్​ లాస్​ రూ. 1490, టార్గెట్​ రూ. 1650

రేయ్మాండ్- బై రూ. 553, స్టాప్​ లాస్​ రూ. 525, టార్గెట్​ రూ. 600

సీసీఎల్ ప్రాడక్ట్స్- బై రూ. 1193, స్టాప్​ లాస్​ రూ. 1135, టార్గెట్​ రూ .1290

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More