లాంచ్ అయిన కొన్ని రోజులకే iPhone Air స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్..
ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ స్మార్ట్ఫోన్పై అమెజాన్లో మంచి డిస్కౌంట్ లభిస్తోంది! మీరు ఈ గ్యాడ్జెట్ కొనాలని భావిస్తుంటే, ఇదే సరైన సమయం! డిస్కౌంట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యాపిల్ లవర్స్కి బిగ్ న్యూస్! ఐఫోన్ 17 మోడల్స్తో పాటు ఐఫోన్ ఎయిర్ సేల్స్ మొదలైన నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఈ ఫోన్ కొనుగోలు కోసం వేచి చూస్తున్న వారికి ఇదొక శుభవార్త. ప్రస్తుతం ఈ ఫోన్ అద్భుతమైన ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది! సాధారణంగా దీని ఎంఆర్పీ రూ. 1,19,900 ఉండగా, 256జీబీ వేరియంట్పై కొత్తగా వచ్చిన హెచ్డీఎఫ్సీ కార్డు ఆఫర్ ద్వారా రూ. 6,750 వరకు తగ్గింపు లభిస్తోంది.

ఐఫోన్ ఎయిర్ను రూ. 1,13,000కే పొందడం ఎలా? ఆఫర్ వివరాలు..
మీరు ఇప్పుడే అమెజాన్ వెబ్సైట్ను సందర్శిస్తే, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి చెల్లింపు చేస్తే తక్షణమే రూ. 6,750 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ పూర్తి తగ్గింపు ఈఎంఐ లావాదేవీలకు వర్తిస్తుంది. దీనితో ఈ ఫోన్ నికర ధర రూ. 1,13,150కి తగ్గుతుంది.
ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్ తీసుకోకుండా కొనుగోలు చేయాలనుకుంటే, అప్పుడు కూడా రూ. 6,250 తగ్గింపు లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ ధర రూ. 1,13,650 అవుతుంది.
ఐఫోన్ ఎయిర్పై లాంచ్ సమయంలో కేవలం రూ. 5,000 మాత్రమే తగ్గింపు లభించింది. కానీ, ఇప్పుడది రూ. 6,750కి పెరిగింది. కాబట్టి, అసలు ధర రూ. 1,19,900తో పోలిస్తే, ఇది మెరుగైన డీల్ అని చెప్పవచ్చు.
- శాంసంగ్ గెలాక్సీ ఎం17- బెస్ట్ సెల్లింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఐఫోన్ ఎయిర్ కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి?
ఐఫోన్ ఎయిర్ స్మార్ట్ఫోన్ అనేది డిజైన్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఫోన్. మునుపటి ఏ ఐఫోన్లోనూ లేని విధంగా, ఇది నిజంగా ప్రత్యేకమైన డిజైన్ను కలిగి ఉంది. అయితే మీరు ఈ ఫోన్ తీసుకుంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది.
- కెమెరా నాణ్యత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.
- స్పీకర్ నాణ్యత కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చు.
- బ్యాటరీ లైఫ్ విషయంలో రాజీ పడాలి.
అదనంగా, ఈ ఫోన్ ఈ-సిమ్కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి, మీరు తరచుగా సిమ్లను మార్చే అలవాటు ఉన్నవారైతే, ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు.
మీరు మంచి మీడియా అనుభవాన్ని కోరుకుంటే, స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. కానీ, సౌండ్ కోసం స్పీకర్ అంత అనుకూలంగా ఉండదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


