Stock market crash : ఇరాన్​పై దాడులు- ఈరోజు స్టాక్​ మార్కెట్​ క్రాష్​! ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు..

పశ్చిమాసియాలో ఉద్రిక్తితల వేళ ఇన్వెస్టర్లను కలవరపెట్టే వార్త! బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 550 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

Published on: Mar 04, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హోలీ సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు లభించింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1048 పాయింట్లు పడి 80,239 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 313 పాయింట్లు కోల్పోయి 24,866 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 689 పాయింట్లు పడి 59,840 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

పశ్చిమాసియాలో ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్​ దాడులతో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు పతనం అవుతున్నాయి. ఇందులో భాగంగా దేశీయ ఇన్వెస్టర్లు సైతం నష్టాలు చూడక తప్పడం లేదు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,295.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,593.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ అతి భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 550 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

నిఫ్టీ50 ట్రెండ్​ నెగిటివ్​గా ఉంది. 25,100 వద్ద బలమైన రెసిస్టెన్స్​ కూడా ఉంది. కానీ 24,600 దిగువకు సూచీ పడిపోతే మరింత సెల్లింగ్​ ప్రెజర్​ కనిపించవచ్చు. నిఫ్ట50 24,300 వరకు కూడా వెళ్లొచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.8 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.94శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.02 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్​ నిక్కీ 2.5శాతం పతనమైంది. సౌత్​ కొరియా కాస్పీ ఏకంగా 6.19శాతం పడిపోయింది.

ముడి చమురు ధరలు..

అమెరికా- ఇజ్రాయెల్​తో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారం అయిన హర్ముజ్​ జలసంధిని ఇరాన్​ మూసివేసింది. ఇది ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కు 83 డాలర్ల చేరువలో ఉంది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

త్రివేణి ఇంజినీరింగ్​ అండ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 395.4, స్టాప్​ లాస్​ రూ. 370, టార్గెట్​ రూ. 445

హిందుస్థాన్​ జింక్​- బై రూ. 617.6, స్టాప్​ లాస్​ రూ. 585, టార్గెట్​ రూ. 675

జిందాల్​ పాలీ ఫిల్మ్స్​- బై రూ. 627.35, స్టాప్​ లాస్​ రూ. 590, టార్గెట్​ రూ. 700

లుపిన్​- బై రూ. 2311.10, స్టాప్​ లాస్​ రూ. 2200, టార్గెట్​ రూ. 2500

ఆస్ట్రా మైక్రోవేవ్​ ప్రాడక్ట్స్​- బై రూ. 982.4, స్టాప్​ లాస్​ రూ. 940, టార్గెట్​ రూ. 1050

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)