కూతురు పుట్టాక తలరాత మారిన హీరోలు- సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్, నేషనల్ లెవెల్ క్రేజ్- ఎవరెవరికంటే?
ఎన్నో ఏళ్లుగా కష్టపడి స్టార్డమ్ను సంపాదించుకుంటారు హీరోలు. అలాంటి కథాయనాకుల తలరాత వారికి కూతురు పుట్టగానే అమాంతం మారిపోయింది. కుమార్తె పుట్టిన తర్వాత చేసిన సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోలు, వాటి కలెక్షన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోలుగా మారిన నేషనల్ లెవెల్లో స్టార్డమ్, క్రేజ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పటికీ స్టార్ కిడ్స్, బిగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు మంచి క్రేజ్ కోసం, సూపర్ హిట్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే, ఎన్నో ఏళ్లకు రాని విపరీతమైన క్రేజ్ ఒక్క కూతురు పుట్టగానే వచ్చింది ఈ హీరోలకు.

అవును, కో ఇన్సిడెన్స్ లేదా హార్డ్ వర్క్తో వచ్చిన అదృష్టమో కానీ ఈ హీరోలకు కూతురు పుట్టాక తలరాత మారిపోయింది. కుమార్తె పుట్టిన తర్వాత చేసిన సినిమాకు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రావడంతోపాటు నేషనల్ వైడ్గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం.
యశ్
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా యశ్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. కన్నడలో హీరోగా అలరించిన యశ్ ఒక్క కేజీఎఫ్ సినిమాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. అలాగే,ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కెట్ చేసిందని సమాచారం.
అయితే, యశ్కు కూతురు ఐరా 2018 డిసెంబర్ 2న పుడితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ అదే ఏడాది డిసెంబర్ 21న విడుదల అయింది. ఈ లెక్కన కూతురు పుట్టాకే యశ్ నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడని అనుకోవచ్చు.
రణ్బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న రణ్బీర్ కపూర్ యానిమల్ మూవీతోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో సైతం ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. రణ్బీర్, అలియా భట్ దంపతులకు కూతురు రాహా కపూర్ 2022 నవంబర్ 6న జన్మించింది.
కూతురు పుట్టిన సుమారు ఏడాదికి అంటే 2023 డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అయింది. అప్పటి వరకు ఏ సినిమా చేయిని రణ్బీర్ కపూర్ యానిమల్తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా సుమారుగా వెయ్యి కోట్ల మార్కెట్ సాధించింది.
రణ్వీర్ సింగ్
ప్రస్తుతం ధురంధర్ ఫీవర్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ ధురంధర్ మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణె జంటకు కూతురు దువా పదుకొణె సింగ్ 2024 సెప్టెంబర్ 8న పుట్టింది.
కూతురు పుట్టిన ఏడాదికి 2025 డిసెంబర్ 5న ధురంధర్ రిలీజ్ అయి నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకుముందు రణ్వీర్ సింగ్ కూడా ఏ సినిమా చేయలేదు. ఇక ధురంధర్ సినిమాకు ఏకంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












