ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదం మరవకముందే ఏపీలో మరికొన్ని ఘటనలు జరిగాయి. తాజాగా బాపట్ల జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారు, లారీ ఢీ కొట్టాయి. దీంతో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర ప్రమాద జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు, లారీ బలంగా ఢీ కొట్టాయి. కారులో ఉన్న నలుగురు మరణించారు. మృతులను కర్లపాలెం చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఇందులో ఇద్దరు బాలురు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ బస్సు ప్రమాదం
తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 70 మందితో ప్రయాణిస్తున్న బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో కంకర మెుత్తం బస్సులో పడింది. 19 మంది ఈ ఘటనలో చనిపోయారు. మిగిలినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అతివేగంతో రావడం, గుంత ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. జేసీబీలు తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 'పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.' అని చెప్పారు.
{{/usCountry}}తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 'పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.' అని చెప్పారు.
{{/usCountry}}చేవెళ్ళ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో ప్రయాణికులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.