స్వామిత్వ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులను కల్పించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను సరిగా చేసి.. వాటిపై హక్కులను సంబంధిత వ్యక్తులకు కల్పిస్తున్నారు. స్వామిత్వ పథకం రెండో విడతలో భాగంగా 45 లక్షల ప్రాపర్టీ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోని ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు ఇవ్వడం. ప్రాపర్టీ కార్డులు గ్రామాల్లోని ఇళ్లు, స్థలాలకు సంబంధించిన అధికారిక పత్రాలుగా ఉంటాయి. వీటితో ఆస్తి ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. వివాదాలు కూడా తగ్గుతాయి. ఆస్తి హక్కు కోసం చూస్తున్న గ్రామీణులకు దీనితో మేలు జరుగుతుంది. ఆబడి, అనాధీన, ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వ లెక్కల్లో లేని ఆస్తులను గుర్తించి.. సంబంధిత హక్కుదారలు పట్టాలు అందిస్తారు.
ప్రభుత్వం నాలుగు నెలల్లో 5 వేలకుపైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేసి ప్రాపర్టీ కార్డులను ఇవ్వడానికి సిద్ధమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో పనులు వేగవంతం అయ్యాయి. 2026 మార్చిలోపు ఏపీలోని ప్రతీ గ్రామంలోనూ హక్కుదారలకు కార్డులను అందజేస్తారు. ఇవాళ్టి నుంచి 2344 గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి.. ఆస్తుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారు.
గ్రామస్థుల దగ్గర ఉన్న ఆధారాల ఆధారంగా ఆస్తుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేసి వారంలోగా పరిష్కారం చేస్తారు. ఒకవేళ పరిష్కారం కాకపోతే.. ఫారమ్-19 ద్వారా అప్పీల్ చేసుకుని.. రీసర్వే కోసం డిప్యూటీ తహసీల్దార్ వద్దకు పంపిస్తారు. ఏదైనా కుటుంబానికి డాక్యుమెంట్స్ లేకున్నా.. వారి ఆస్తి గ్రామ కంఠంలో 12 ఏళ్లపాటు ఆధీనంలో ఉన్నా.. వారికి యాజమాన్య పత్రాలు ఇస్తారు.
ఒకవేళ కోర్టు వివాదాలు ఉంటే.. పరిష్కారం తర్వాత కార్డులు జారీ చేస్తారు. ప్రభుత్వ ఆస్తులను సర్వే చేసి జీఐఎస్ మ్యాపులను రూపొందిస్తారు. వీటిని రికార్డుల్లో భద్రపరుస్తారు. స్వామిత్వ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తిని గుర్తించి, విలువను లెక్కించి.. యజమానికి హక్కులు కల్పిస్తారు. ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాదు.. కొనుగోలు, అమ్మకాలు కూడా చేసుకోవచ్చు.
{{/usCountry}}ఒకవేళ కోర్టు వివాదాలు ఉంటే.. పరిష్కారం తర్వాత కార్డులు జారీ చేస్తారు. ప్రభుత్వ ఆస్తులను సర్వే చేసి జీఐఎస్ మ్యాపులను రూపొందిస్తారు. వీటిని రికార్డుల్లో భద్రపరుస్తారు. స్వామిత్వ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తిని గుర్తించి, విలువను లెక్కించి.. యజమానికి హక్కులు కల్పిస్తారు. ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాదు.. కొనుగోలు, అమ్మకాలు కూడా చేసుకోవచ్చు.
{{/usCountry}}