...
...
Next Story

ఏపీ స్త్రీ నిధిలో 170 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూలై 18వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published on: Jul 5, 2025, 13:08:42 IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు.

ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాలు
ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. జూలై 7వ తేదీ అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.జూలై 18వ తేదీ వరకు గడువు ఉంటుంది. https://www.sthreenidhi.ap.gov.in వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ స్త్రీ నిధిలో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

  • ఉద్యోగ నోటిఫికేషన్ - స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్, ఏపీ ప్రభుత్వం.
  • మొత్తం ఖాళీలు - 170
  • ఉద్యోగాలు - అసిస్టెంట్ మేనేజర్ కేడర్
  • కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు.
  • అర్హతలు - ఏదైనా డిగ్రీ
  • 01.06.2025 నాటికి 42 ఏళ్లు దాటకూడదు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 7 జూలై 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ - 18 జూలై 2025
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000
  • నెలకు జీతం - రూ. 25, 520తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
  • ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… షార్ట్ లిస్ట్ (1:4 నిష్పత్తిలో) ఇస్తారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • మొత్తం 100 మార్కులకు ప్రతిపాదికన మెరిట్ లిస్టులను తయారు చేస్తారు. పదో తరగతి మార్కుల నుంచి పని చేసిన అనుభవం వరకు మార్కులను కేటాయిస్తారు. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.sthreenidhi.ap.gov.in

ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూడొచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe