...
...
Next Story

కలెక్టర్ కావాలనుకుని హీరోయిన్ అయింది- 12 ఏళ్లలో అరకొర హిట్సే- ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సినిమా- ఈ తెలుగు హీరోయిన్ ఎవరంటే?

తెలుగులో ఎంతోమంది హీరోయిన్స్ తమ గ్లామర్‌తో రాణిస్తుంటారు. కానీ, అందం, గ్లామర్ అన్ని ఉండి 12 ఏళ్లలో కేవలం అరకొర హిట్స్ మాత్రమే చవిచూసింది ఈ తెలుగు హీరోయిన్. కలెక్టర్ అవ్వాలని కలలు కని చివరికి హీరోయిన్ అయిన ఈ బ్యూటిపుల్ హీరోయిన్ ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సినిమా చేయనుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published on: Aug 2, 2025, 14:22:53 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement
<p>తెలుగులో ఎంతోమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. కానీ, అందం, గ్లామర్, యాక్టింగ్ అన్నీ ఉండి కూడా ఓ ముద్దుగుమ్మ మాత్రం అరకొర హిట్స్‌తో సరిపెట్టుకుంటోంది.</p>

తెలుగులో ఎంతోమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. కానీ, అందం, గ్లామర్, యాక్టింగ్ అన్నీ ఉండి కూడా ఓ ముద్దుగుమ్మ మాత్రం అరకొర హిట్స్‌తో సరిపెట్టుకుంటోంది.

సినీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతున్న భారీ హిట్ అందుకోలేకపోయిన ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా. ఇంకెవరో కాదు అందాల రాశి.. రాశీ ఖన్నా.

రెడ్ కలర్ బికినీలో హాట్ షోతో అట్రాక్ట్ చేస్తున్న రాశి ఖన్నా ముందుగా బాలీవుడ్‌లో మద్రాస్ కేఫ్ సినిమాతో 2013లో హీరోయిన్‌గా పరిచయం అయింది.

అనంతరం తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఈ ఒక్క సినిమాతోనే ఎంతో మంచి పేరు తెచ్చుకుంది రాశీ ఖన్నా.

కెరీర్ ప్రారంభంలో బబ్లీ గర్ల్‌లా బొద్దుగా ఉన్న రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమా కంటే ముందుగా, నాగ చైతన్య, సమంత, నాగార్జునల మనం సినిమాలో కెమియో రోల్ ప్లే చేసింది. ఇందులో చైకి లవర్‌గా యాక్ట్ చేసింది.

ఆ తర్వాత జిల్, జై లవకుశ, తొలి ప్రేమ, తిరు, సర్ధార్ వంటి సినిమాలతో హిట్ దక్కించుకుంది. కానీ, రాశి ఖన్నాకు మాత్రం హీరోయిన్‌గా అంతగా స్టార్‌డమ్ రాలేకపోయింది.

12 ఏళ్లుగా సరైన హిట్‌కు నోచుకోని రాశి ఖన్నా పస్తుతం పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో పాటు సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీలో కూడా యాక్ట్ చేస్తోంది. మరి ఈ రెండు సినిమాలు రాశి ఖన్నాకు మంచి హిట్ అందిస్తాయో చూడాలి.

ఇకపోతే 12 ఏళ్లుగా హీరోయిన్‌గా రాణిస్తోన్న రాశి ఖన్నా నిజానికి ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలని కలలు కందట. కానీ, ఊహించని విధంగా హీరోయిన్‌ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి ఖన్నా.

“మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగేవారు మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలనుకుంటారు కదా. మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అందుకే అలాంటి మైండ్‌సెట్‌తో నేను కూడా ఐఏఎస్ కావాలనుకున్నా. కానీ, హీరోయిన్ అయ్యాను” అని రాశి ఖన్నా తెలిపింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe