...
...
Next Story

TGPSC Group 3 : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 16న నియామక పత్రాలు అందజేత

గ్రూప్‌-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు.

Published on: Jan 14, 2026 07:20 AM IST
Advertisement

గ్రూప్‌-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. నియామక పత్రాలను అందజేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళా వేదికలో వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 16న నియామక పత్రాలు అందజేత
గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 16న నియామక పత్రాలు అందజేత

ఇటీవలనే తెలంగాణ గ్రూప్‌-3 తుధి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.

పరీక్షల నిర్వహణ తర్వాత వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో… గతేడాది మార్చిలో ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అంతేకాకుండా ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి కావటంతో… డిసెంబర్ 18వ తేదీన తుది ఫలితాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు.

గ్రూప్ 3 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని గ్రూప్ 3 ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్ట్ పై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నెంబర్లతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe