పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగానే ఈసారి ఫలితాలను ప్రకటించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం కాగా…. నేటితో పూర్తి కానుంది. అన్ని సబ్జెక్టుల పేపర్ల దిద్దే ప్రాసెస్ పూర్తి కావటంతో… ఫలితాల క్రోడీకరణపై ఫోకస్ చేస్తున్నారు.

నేటితో స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కానుండగా…. మరో వారం రోజుల పాటు క్రోడీకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే స్కానింగ్ ప్రక్రియ కంప్లీట్ చేస్తారు. మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్)లో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పరిశీలిస్తారు.
మే ఫస్ట్ వీక్ లోనే ఫలితాలు…!
అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. మొదటి వారంలోనూ మే 4 లేదా 5వ తేదీలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ…. మొత్తంగా మే మొదటి వారంలోనే ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఉంది.
తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎస్సెస్సీ బోర్డు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.
పరీక్ష రాసిన విద్యార్థులు…. 80969 58096 నంబర్కు ‘హాయ్’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్చేసి హాల్టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్పై డిస్ ప్లే అవుతుంది.
అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.
{{/usCountry}}అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.
{{/usCountry}}