హైదరాబాద్-విజయవాడ హైవే (NH65)ను ప్రస్తుత నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణ భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక ప్రధాన అడుగుగా హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.

విస్తరణ పూర్తయిన తర్వాత, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 2 గంటలు తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆరు లేన్ల విస్తరణ NH-65 40వ కి.మీ పాయింట్ నుండి 269వ కి.మీ పాయింట్ వరకు 229 కి.మీ.ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలలో అధికారులను నియమించింది.
తెలంగాణలోని అనేక జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను రెవెన్యూ డివిజనల్ అధికారులకు (ఆర్డీఓ) అప్పగించారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలోని తొమ్మిది గ్రామాల నుండి భూమిని సేకరించనున్నారు. నల్గొండ జిల్లాలో చిట్యాల్, నార్కెట్పల్లి మండలాల్లోని ఐదు గ్రామాల నుండి, కట్టంగూర్లో నాలుగు, నకిరేకల్లో రెండు, కేతేపల్లిలో నాలుగు గ్రామాల నుండి భూమిని తీసుకుంటారు.
అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలంలోని నాలుగు, చివ్వెంలలో ఆరు, కోదాడలో నాలుగు, మునగాల మండలంలో ఐదు గ్రామాల నుండి భూమిని సేకరించే పనిని ఆర్డీఓలకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు, సరకు రవాణాకు సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో నాలుగు, కంచికచర్లలో నాలుగు, జగ్గయ్యపేటలో ఏడు, పెనుగంచిప్రోలులో మూడు, ఇబ్రహీంపట్నంలో మండలంలోని 12 గ్రామాల్లో భూ సేకరణ చేస్తారు. అంతేకాదు విజయవాడ రూరల్లో ఒకటి, విజయవాడ వెస్ట్లో రెండు, విజయవాడ నార్త్ పరిధిలోని ఒక గ్రామంలో భూ సేకరణ బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.
{{/usCountry}}ఇక ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో నాలుగు, కంచికచర్లలో నాలుగు, జగ్గయ్యపేటలో ఏడు, పెనుగంచిప్రోలులో మూడు, ఇబ్రహీంపట్నంలో మండలంలోని 12 గ్రామాల్లో భూ సేకరణ చేస్తారు. అంతేకాదు విజయవాడ రూరల్లో ఒకటి, విజయవాడ వెస్ట్లో రెండు, విజయవాడ నార్త్ పరిధిలోని ఒక గ్రామంలో భూ సేకరణ బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.
{{/usCountry}}