...
...
Next Story

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు ఈ మండలాల్లోని గ్రామాల్లో భూ సేకరణ!

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న నాలుగు నుంచి ఆరు లేన్లకు హైవే అప్‌గ్రేడ్ కానుంది. ఇందుకోసం భూసేకరణ కూడా మెుదలుకానుంది.

Published on: Nov 5, 2025, 16:02:56 IST
Advertisement

హైదరాబాద్-విజయవాడ హైవే (NH65)ను ప్రస్తుత నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణ భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక ప్రధాన అడుగుగా హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ

విస్తరణ పూర్తయిన తర్వాత, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 2 గంటలు తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆరు లేన్ల విస్తరణ NH-65 40వ కి.మీ పాయింట్ నుండి 269వ కి.మీ పాయింట్ వరకు 229 కి.మీ.ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలలో అధికారులను నియమించింది.

తెలంగాణలోని అనేక జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను రెవెన్యూ డివిజనల్ అధికారులకు (ఆర్డీఓ) అప్పగించారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలోని తొమ్మిది గ్రామాల నుండి భూమిని సేకరించనున్నారు. నల్గొండ జిల్లాలో చిట్యాల్, నార్కెట్‌పల్లి మండలాల్లోని ఐదు గ్రామాల నుండి, కట్టంగూర్‌లో నాలుగు, నకిరేకల్‌లో రెండు, కేతేపల్లిలో నాలుగు గ్రామాల నుండి భూమిని తీసుకుంటారు.

అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలంలోని నాలుగు, చివ్వెంలలో ఆరు, కోదాడలో నాలుగు, మునగాల మండలంలో ఐదు గ్రామాల నుండి భూమిని సేకరించే పనిని ఆర్డీఓలకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు, సరకు రవాణాకు సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe