తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం విచారణ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ను అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. డిజిటల్ డివైసెస్లో డేటా ఫార్మా చేశారన్నారు. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిపోగానే.. హార్డ్ డిస్క్లలో డేటా ధ్వంసం చేసినట్టుగా న్యాయవాదులు వెల్లడించారు.
'కొత్తగా 50 హార్డ్ డిస్క్లు అక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లను టాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలను చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారు.'అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. 'ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనను 11సార్లు పిలిపించి 80 గంటల పాటు విచారణ చేశారు. డేటాను ప్రభాకర్ డిలీట్ చేయలేదు. డిపార్ట్మెంట్ డిలీట్ చేసింది.' అని వాదనలు వినిపించారు.
ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని తెలిపింది. క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. సమాచారం చెరిపేందుకు ప్రయత్నించినట్టు తేలితే.. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.
{{/usCountry}}ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని తెలిపింది. క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. సమాచారం చెరిపేందుకు ప్రయత్నించినట్టు తేలితే.. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.
{{/usCountry}}