తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కప్రకటన చేశారు. తక్షణమే ఒక DAను ఇస్తున్నట్లు తెలిపారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలివే…

{{^htLoading}} {{/htLoading}}
మెట్రో రెండో విడత విస్తరణపై తెలంగాణ కేబినెట్లో చర్చ జరిగింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించింది. లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు చెల్లిస్తూ ఆమోదముద్ర వేసింది. హమ్ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని కేబినెట్నిర్ణయించింది.
- ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు. బీమాకు ఉద్యోగులు ప్రతినెలా రూ.500చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత్త చెల్లిస్తుంది.
- ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్ బకాయిలను నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లించేందుకు నిర్ణయం.
- పెండింగ్ బకాయిలను నెలల వారీగా క్లియర్ చేసేలా కేబినెట్ నిర్ణయం.
- మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే రూ.10లక్షలు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం.
- ఆర్అండ్బీ పరిధిలో 5,100 కి.మీ, పంచాయతీరాజ్ పరిధిలో 7,947 కి.మీ రహదారులు ఆధునీకరణకు నిర్ణయం.
- కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్శిటీకి మన్మోహన్సింగ్ పేరు పెట్టేందుకు మంత్రివర్గం నిర్ణయం.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}