ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేయడం ద్వారా యోగాను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టేలా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఈవెంట్లో పాల్గొనే సాధకులకు, ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులను నిర్దేశించారు. ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచే ఉత్తమ యోగా మాస్టర్ ట్రైనర్లను గుర్తించి…. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదికగా వారికి ప్రత్యేక ప్రభుత్వ పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
జూన్ 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ఒకేసారి 5 వేల నుంచి 6 వేల మంది కలసి యోగాసనాలు వేసేలా అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రాష్ట్రస్థాయి ఈవెంట్కు ముఖ్యమంత్రితో పాటు బాబా రాందేవ్ హాజరవుతారు. ఒకవేళ జూన్ 21న వర్షం కారణంగా ఏవైనా అవాంతరాలు ఎదురైతే, ప్రత్యామ్నాయంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో స్టేట్ ఈవెంట్ సజావుగా సాగేలా అధికారులు బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేశారు.
1.33 లక్షల కేంద్రాలు.. కోటికిపైగా రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో యోగాంధ్ర ఉద్యమం ఏ స్థాయిలో సాగుతోందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యోగాంధ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.6 లక్షల మందిని యోగా ట్రైనర్లుగా (శిక్షకులుగా) తీర్చిదిద్దినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. జూన్ 21న జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా ప్రజలు తమ పేర్లను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
{{/usCountry}}రాష్ట్రంలో యోగాంధ్ర ఉద్యమం ఏ స్థాయిలో సాగుతోందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యోగాంధ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.6 లక్షల మందిని యోగా ట్రైనర్లుగా (శిక్షకులుగా) తీర్చిదిద్దినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. జూన్ 21న జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా ప్రజలు తమ పేర్లను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
{{/usCountry}}ఈ దినోత్సవం సందర్భంగా జూన్ 18 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.33 లక్షల కేంద్రాలలో ఏకకాలంలో యోగా కార్యక్రమాలు జరిగేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే వేదికపై ‘యోగా@డెస్టినేషన్’ పేరుతో వచ్చే ఏడాది యోగా దినోత్సవం వరకు అనుసరించాల్సిన పూర్తి యోగా క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు.