ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, జాప్యాన్ని తగ్గించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇక మీదట రాష్ట్రంలోని అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

మే 1 నుంచి ఫిజికల్ అప్లికేషన్లకు స్వస్తి పలకనుంది ప్రభుత్వం. పోర్టల్ ద్వారానే అప్లికేషన్లను తీసుకునే కొత్త రూల్ను అమలు చేయనుంది. ప్రస్తుతం కాగితపు దరఖాస్తుల విధానానికి ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీ 2026 వరకు అందించిన ఫిజికల్ పెన్షన్ ప్రపోజల్స్ను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు.
ఇక మే 1, 2026 నుంచి ఎలాంటి పేపర్ అప్లికేషన్లు స్వీకరించమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మే 1 తర్వాత వచ్చే పెన్షన్ దరఖాస్తులను తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారానే ఆన్లైన్లో సమర్పించాలి. పలు శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫిజికల్ దరఖాస్తులు ఏప్రిల్ 30వ తేదీలోపు సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించింది.
కీలక మార్పులు ఇవే:
మే 1 నుంచి అమలు: 2026, మే 1వ తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులు నిధి పోర్టల్ ద్వారానే జరగాలి.
పేపర్ దరఖాస్తులకు స్వస్తి: ప్రస్తుతం అమల్లో ఉన్న కాగితపు (Physical) దరఖాస్తుల విధానాన్ని ప్రభుత్వం నిలిపివేస్తోంది. ఏప్రిల్ 30, 2026 వరకు అందిన ఫిజికల్ అప్లికేషన్లను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు.
ముందస్తు అప్లోడ్: ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందే వారి పెన్షన్ వివరాలను నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
{{/usCountry}}ముందస్తు అప్లోడ్: ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందే వారి పెన్షన్ వివరాలను నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
{{/usCountry}}పెండింగ్ ఫైళ్లు: ప్రస్తుతం వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న కాగితపు దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా (ఏప్రిల్ 30) సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం.
కొత్త విధానంతో ప్రయోజనాలు
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పెన్షన్ ప్రక్రియ సాగుతుంది. పెన్షనర్ తన ఫైల్ ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, డిజిటల్ సంతకాలతో ఫైళ్లు వేగంగా కదులుతాయి. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ మంజూరులో జాప్యాన్ని తగ్గించవచ్చు.
రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు, జిల్లా అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మే 1 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ అప్లికేషన్లు స్వీకరించరు. పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెబుతున్నారు.