తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయం పుట్టిస్తున్నాయి. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన మరవకముందే తెలంగాణలో ఆర్టీసీ బస్సుపై కంకర లోడు పడి ప్రయాణికులు మృతి చెందిన ఘటన జరిగింది. ఆ తర్వాత చిన్న చిన్న రోడ్డు ప్రమాద వార్తలు తరచూగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రోడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది.

విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు కాలిపోయింది. ఉదయం 7.45 గంటలకు ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇంజిన్లో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. బస్సును పక్కకు ఆపేశారు. వెంటనే ప్రయాణికులు దిగిపోవాలని చెప్పారు. ఈ సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు కూడా వెంటనే అప్రమత్తమై దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే.. ఘటనా స్థలానికి వచ్చి మంటలు అదుపు చేశారు. సకాలంలో డ్రైవర్ అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుకు దగ్గరగా ఉన్న పాచిపెంట మండలంలోని రొడ్డవలస సమీపంలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్ అప్రమత్తమయ్యారని తెలిపారు. కానీ ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
బస్సు ప్రమాదం గురించి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో మాట్లాడారు. ఎస్పీతో ఈ విషయం గురించి ఫోన్లో చర్చించారు. ప్రయాణికులకు ప్రమాదం లేదని తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తుల్లో జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సంధ్యారాణి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్ పంపారు.
బాపట్ల పట్టణంలో బైక్ యాక్సిడెంట్
మరోవైపు బాపట్ల పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గడియార స్తంభం కూడలి దగ్గర వేగంగా వస్తున్న బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిని గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్, చింతల నానిగా గుర్తించారు. చీరాల నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద ఉన్న యువకులు ఎగిరి కిందపడి ఘటన స్థలంలోనే మరణించారు.
{{/usCountry}}మరోవైపు బాపట్ల పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గడియార స్తంభం కూడలి దగ్గర వేగంగా వస్తున్న బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిని గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్, చింతల నానిగా గుర్తించారు. చీరాల నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద ఉన్న యువకులు ఎగిరి కిందపడి ఘటన స్థలంలోనే మరణించారు.
{{/usCountry}}