గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక లాకప్డెత్ (పోలీస్ కస్టడీలోనే మరణం) అని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ప్రత్యేక విచారణ బృందం (SIT) నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, పోలీసులు ఆయన్ను 2వ ఏజేఎస్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచనల విషయాలు విషయాలను పొందుపరిచారు.
రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు

సాయికృష్ణది ముమ్మాటికీ లాకప్డెత్ అని సిట్ స్పష్టం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్పై అతడిని స్టేషన్కు తీసుకొచ్చి, తీవ్రంగా గాయపరచడం వల్లే మరణించాడని పేర్కొంది. అనంతరం ఆధారాలు దొరకకుండా శవాన్ని మాయం చేశారని వెల్లడించింది.
మే 5 నుంచి జూన్ 19 (2026) మధ్య కాలంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించి ఉంటాడని సిట్ భావిస్తోంది. నిందితుడు సీఐ నాగరాజే స్వయంగా సాక్ష్యాలను నాశనం చేశారని సిట్ తెలిపింది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న పోలీస్ స్టేషన్ సీసీటీవీ డీవీఆర్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆ డీవీఆర్లను రికవరీ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
మే 5వ తేదీ నుంచి 8వ తేదీల మధ్య సాయికృష్ణ కృష్ణలంక పీఎస్ లోనే ఉన్నాడని, అక్కడే అతడి మృతదేహాన్ని చూశానని సదరు స్టేషన్ ఎస్ఐ వాంగ్మూలం ఇవ్వడం కేసులో అత్యంత కీలకంగా మారింది. స్టేషన్ మహిళా సిబ్బంది హిమజను కూడా సిట్ విచారించింది. 17 మంది సాక్షులను విచారించి వివరాలు సేకరించారు.
సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదంటూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ వేసినా.. అటు హైకోర్టుకు గానీ, ఇటు స్థానిక మేజిస్ట్రేట్కు గానీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిజాలను దాచిపెట్టారు. న్యాయస్థానాన్ని తీవ్రంగా తప్పుదోవ పట్టించారు. బాధితుడి తల్లి స్టేషన్కు వస్తే సీఐ నాగరాజు ఆమెను దుర్భాషలాడారు.
{{/usCountry}}సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదంటూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ వేసినా.. అటు హైకోర్టుకు గానీ, ఇటు స్థానిక మేజిస్ట్రేట్కు గానీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిజాలను దాచిపెట్టారు. న్యాయస్థానాన్ని తీవ్రంగా తప్పుదోవ పట్టించారు. బాధితుడి తల్లి స్టేషన్కు వస్తే సీఐ నాగరాజు ఆమెను దుర్భాషలాడారు.
{{/usCountry}}శాస్త్రీయ ఆధారాలను రూపుమాపి, సాయికృష్ణను పోలీసు కస్టడీలోనే హత్య చేశారనేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ దారుణం వెనుక ఉన్న పూర్తి కోణాలను, మరిన్ని విషయాలను రాబట్టేందుకు నిందితుడైన సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది.
'అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందితుడైన నాగరాజును విచారించాలి. జూన్ 2వ తేదీ కంటే ముందే సాయికృష్ణ మరణించాడని విశ్వస్తున్నాం. కస్టడీలో ఉండగా గాయాలపాలై మరణించాడు. ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. పరిణామాలన్నీ గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశారని గుర్తించాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు.' అని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది.