కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారటంతో విషయం బయటికి వచ్చింది. దీంతో నిందితుడైన నారాయణరావుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పిన నారాయణరావు(62) సమీపంలోని కోమటిచెరవులో దూకాడు. తుని గ్రామీణ పోలీస్స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా… నారాయణరావు మృతదేహాం లభ్యమైంది.
అసలేం జరిగిందంటే..?
తుని రూరల్ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను నారాయణ రావు అనే వ్యక్తి హాస్టల్ నుంచి స్కూటీపై తీసుకెళ్లాడు. సమీపంలోని హంసవరం సపోటా తోటల్లో తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా తాకాడు. అత్యాచారం చేసేందుకు యత్నించబోయాడు.
ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని ఓ స్థానికుడు గమనించాడు. అతని వద్దకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. బాలికను తోటలోకి తీసుకొచ్చి అత్యాచారం చేస్తున్నావా అని నిలదీశాడు. అలాంటిదేమీ లేదు… బాలికను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని దబాయించాడు. అంతటితో ఆగని నారాయణరావు… తాను ఓ పార్టీ కౌన్సిలర్ను అంటూ చెప్పుకొచ్చాడు. పలు అంశాలపై ప్రశ్నిస్తుండగానే… స్కూటీపై సదరు బాలికను ఎక్కించుకోని నారాయణరావు వెళ్లిపోయాడు. ఇదంతా కూడా వీడియోలో రికార్డు అయింది.
బాలికకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికినట్లు తెలిసింది. ఈ క్రమంలోే పలుమార్లు కూడా బయటికి తీసుకెళ్లాడు. మంగళవారం రోజు కూడా బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే అతగాడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నారాయణరావుకు దేహశుద్ధి చేశారు.
{{/usCountry}}బాలికకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికినట్లు తెలిసింది. ఈ క్రమంలోే పలుమార్లు కూడా బయటికి తీసుకెళ్లాడు. మంగళవారం రోజు కూడా బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే అతగాడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నారాయణరావుకు దేహశుద్ధి చేశారు.
{{/usCountry}}