...
...
Next Story

Geetha Madhuri: గీతా మాధురి ‘కాపురాలు కూలుతాయ్’ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఎవరు వాళ్లు?

Geetha Madhuri: ప్రముఖ గాయని గీతా మాధురి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. తాను చాలా మంది సెలబ్రిటీలను బయట రెడ్ హ్యాండెడ్‌గా చూశానని, ఆ నిజాలు చెబితే వారి వైవాహిక జీవితాలు చిన్నాభిన్నమవుతాయని ఆమె సంచలన ప్రకటన చేశారు.

Published on: Apr 23, 2026 08:47 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Geetha Madhuri: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం గాయనిగానే కాకుండా, తన విలక్షణమైన వ్యక్తిత్వంతో కూడా ఆమె ఎంతో మందికి ఇష్టమైన సెలబ్రిటీగా నిలిచారు.

Geetha Madhuri: గీతా మాధురి ‘కాపురాలు కూలుతాయ్’ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఎవరు వాళ్లు?
Geetha Madhuri: గీతా మాధురి ‘కాపురాలు కూలుతాయ్’ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఎవరు వాళ్లు?

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే గీతా మాధురి.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. “నేను నోరు తెరిస్తే చాలా మంది కాపురాలు కూలిపోతాయి” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

నోయెల్ టాక్ షోలో అసలు విషయాలు..

గాయకుడు నోయెల్ సెన్ నిర్వహిస్తున్న ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో గీతా మాధురి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు పరిశ్రమలో తాను చూసిన కొన్ని చేదు నిజాల గురించి కూడా ప్రస్తావించారు.

తాను అప్పుడప్పుడు ఏకాంతంగా గడపడానికి కాఫీ షాపులకు వెళ్తుంటానని, ఆ సమయంలో అక్కడ తనకు తెలిసిన చాలా మంది సెలబ్రిటీలు తమ భాగస్వాములు కాకుండా వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం గమనించానని వెల్లడించారు. “నేను వెళ్లిన రోజే వాళ్లు నాకు చాలా సార్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతుంటారు” అని ఆమె నిర్మొహమాటంగా చెప్పడం గమనార్హం.

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై చర్చ..

అక్కడ తాను చూసిన వాటిని ఎవరికైనా వెల్లడిస్తే, అది చాలా పెద్ద ఇబ్బందులకు దారితీస్తుందని గీతా మాధురి అభిప్రాయపడ్డారు. ఒకవేళ తాను చూసిన నిజాలను బయట పెడితే వాళ్ల కాపురాలే కూలిపోతాయని అనడం గమనార్హం. అలా చాలా మందిని తాను చూసినట్లు కూడా తెలిపింది.

ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గీతా మాధురి చూసిన ఆ ‘రెడ్ హ్యాండెడ్’ సెలబ్రిటీలు ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

గీతా మాధురి భర్త నందు కూడా నటుడిగా రాణిస్తున్న నేపథ్యంలో, పరిశ్రమలోని అంతర్గత విషయాలు ఆమెకు బాగానే తెలుస్తాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గీతా మాధురి చేసిన ఈ ‘నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి’ అనే స్టేట్‌మెంట్ ఇప్పుడు వెండితెర వెనుక ఉన్న చీకటి కోణాలను మరోసారి తెరపైకి తెచ్చింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. గీతా మాధురి ఏ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు?

గాయకుడు నోయెల్ సెన్ తన యూట్యూబ్ ఛానల్ కోసం నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో గీతా మాధురి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

2. సెలబ్రిటీల గురించి గీతా మాధురి చేసిన సంచలన వ్యాఖ్య ఏమిటి?

“నేను చూసిన విషయాలు గనుక బయట పెడితే, చాలా మంది సెలబ్రిటీల కాపురాలు కూలిపోతాయి” అని ఆమె వ్యాఖ్యానించారు.

3. గీతా మాధురి సెలబ్రిటీలను ఎక్కడ చూశానని చెప్పారు?

తాను అప్పుడప్పుడు వెళ్లే కాఫీ షాపుల్లో చాలా మంది ప్రముఖులు ఇతరులతో సన్నిహితంగా ఉండగా తనకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని ఆమె తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe