...
...
Next Story

తిరుపతి ఐఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.iiits.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Published on: Jul 18, 2025 09:19 AM IST
By , , Andhrapradesh, Tirupati
Prefer HTon Google
Advertisement

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ల ప్రక్రియ జూలై 18వ తేదీతో ప్రారంభమవుతుంది. ఈ గడువు ఆగస్టు 13వ తేదీతో పూర్తవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఐఐటీ తిరుపతి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

  • ఉద్యోగ ప్రకటన -ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్
  • ఉద్యోగాలు - నాన్ టీచింగ్
  • ఖాళీల వివరాలు - అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెట్, జూనియర్ ఇంజినీర్, సివిల్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియల్ సూపరింటెండ్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషిన్.
  • ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా అర్హతలను నిర్ణయించారు. ఈ వివరాలను https://www.iiits.ac.in/careersiiits/staff/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 18 జూలై 2025.(మధ్యాహ్నం 3 గంటల నుంచి)
  • దరఖాస్తులకు చివరి తేదీ - 13 ఆగస్టు 2025.(సాయంత్రం 5 గంటల వరకు)
  • అధికారిక వెబ్ సైట్ - https://www.iiits.ac.in/

తిరుపతి ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు
తిరుపతి ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఖాళీలు, ఎంపిక విధానం వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe