...
...
Next Story

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా ఈ వస్తువులు కొనకండి.. చాలా సమస్యలు రావచ్చు!

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా, ఏ వస్తువు కొన్నా అది 'అక్షయం' అవుతుందని నమ్మకం. అందుకే చాలామంది ఈ రోజున బంగారం, వెండి, ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. కానీ కొన్ని వస్తువులను కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ.

Published on: Apr 15, 2026, 09:21:26 IST
Advertisement
<p>ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు రోహిణి నక్షత్రంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు గజకేసరి యోగం వంటి అరుదైన శుభ యోగాలు కలవబోతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రోజున పొరపాట్లు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిక.</p>

ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు రోహిణి నక్షత్రంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు గజకేసరి యోగం వంటి అరుదైన శుభ యోగాలు కలవబోతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రోజున పొరపాట్లు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిక.

ఈ రోజున బంగారం, వెండి, ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

ఇనుము, స్టీల్ వస్తువులు వద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రోజున ఇనుము (Iron) లేదా స్టీల్‌తో చేసిన వస్తువులను, పనిముట్లను కొనడం అశుభం. ఇనుము శని ప్రభావంతో ముడిపడి ఉన్నందున, ఇది మీ ఇంట్లోని సుఖశాంతులపై ప్రభావం చూపుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

ముళ్ళ మొక్కలు వద్దు: అక్షయ తృతీయ నాడు ఇల్లు పచ్చదనంతో ఉండాలని మొక్కలు కొంటుంటారు. అయితే కాక్టస్ (Cactus) వంటి ముళ్ళతో కూడిన మొక్కలను ఈ రోజున ఇంటికి తీసుకురాకూడదు. ఇవి ఇంట్లోని సానుకూల శక్తిని హరించివేస్తాయి

ప్లాస్టిక్ వస్తువులు కొనకండి: నేటి ఆధునిక కాలంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. కానీ అక్షయ తృతీయ నాడు ప్లాస్టిక్ సామాన్లు, బొమ్మలు లేదా ఫర్నిచర్ కొనడం అరిష్టంగా భావిస్తారు. ప్లాస్టిక్ అనేది సహజ సిద్ధమైనది కాదు, ఇందులో సానుకూల శక్తి ఉండదు.

పదునైన వస్తువుల జోలికి వెళ్లకండి: కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు లేదా ఏవైనా పదునైన లోహపు వస్తువులను ఈ రోజున కొనుగోలు చేయకూడదు. ఇలాంటి వస్తువులను శుభదినాన ఇంటికి తెస్తే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe