
ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు రోహిణి నక్షత్రంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు గజకేసరి యోగం వంటి అరుదైన శుభ యోగాలు కలవబోతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రోజున పొరపాట్లు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిక.
ఈ రోజున బంగారం, వెండి, ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఇనుము, స్టీల్ వస్తువులు వద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రోజున ఇనుము (Iron) లేదా స్టీల్తో చేసిన వస్తువులను, పనిముట్లను కొనడం అశుభం. ఇనుము శని ప్రభావంతో ముడిపడి ఉన్నందున, ఇది మీ ఇంట్లోని సుఖశాంతులపై ప్రభావం చూపుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ముళ్ళ మొక్కలు వద్దు: అక్షయ తృతీయ నాడు ఇల్లు పచ్చదనంతో ఉండాలని మొక్కలు కొంటుంటారు. అయితే కాక్టస్ (Cactus) వంటి ముళ్ళతో కూడిన మొక్కలను ఈ రోజున ఇంటికి తీసుకురాకూడదు. ఇవి ఇంట్లోని సానుకూల శక్తిని హరించివేస్తాయి
ప్లాస్టిక్ వస్తువులు కొనకండి: నేటి ఆధునిక కాలంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. కానీ అక్షయ తృతీయ నాడు ప్లాస్టిక్ సామాన్లు, బొమ్మలు లేదా ఫర్నిచర్ కొనడం అరిష్టంగా భావిస్తారు. ప్లాస్టిక్ అనేది సహజ సిద్ధమైనది కాదు, ఇందులో సానుకూల శక్తి ఉండదు.
పదునైన వస్తువుల జోలికి వెళ్లకండి: కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు లేదా ఏవైనా పదునైన లోహపు వస్తువులను ఈ రోజున కొనుగోలు చేయకూడదు. ఇలాంటి వస్తువులను శుభదినాన ఇంటికి తెస్తే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.