...
...
Next Story

OTT: శుక్రవారం ఓటీటీలో ఎంటర్‌టైన్మెంట్ సునామీ.. రేపు స్ట్రీమింగ్‌కు రాబోతున్న క్రేజీ మూవీస్, సిరీస్.. మస్ట్ వాచ్!

OTT: శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ లవర్స్ కు పండగే. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. ఈ ఫ్రైడే కూడా అదిరిపోయే క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి రాబోతున్నాయి. రేపు ఓటీటీలో మోతే. మరి ఈ కొత్త రిలీజ్ లపై ఓ లుక్కేయండి.

Published on: Jun 11, 2026, 13:18:23 IST
Advertisement
<p>శుక్రవారం ఓటీటీ ప్రేమికులకు స్పెషల్ డే. ఈ శుక్రవారం (జూన్ 12) కూడా ఓటీటీ సందడి అదిరిపోనుంది. రేపు ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ మూవీస్, సిరీస్ లు ఇవే. </p>

శుక్రవారం ఓటీటీ ప్రేమికులకు స్పెషల్ డే. ఈ శుక్రవారం (జూన్ 12) కూడా ఓటీటీ సందడి అదిరిపోనుంది. రేపు ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ మూవీస్, సిరీస్ లు ఇవే.

‘రాఖ్’ - 'మిర్జాపూర్'లో గూడ్డూ భయ్యా అలి ఫజల్ మళ్లీ తన నటనను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలి ఫజల్ న‌టించిన వెబ్ సిరీస్ 'రాఖ్' ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ షో. ఈ సిరీస్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

‘భూత్ బంగ్లా’ - అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దృఢం కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

'కరుప్పు' - సౌత్ సూపర్‌స్టార్ సూర్య, త్రిష కృష్ణన్ నటించిన తమిళ యాక్షన్ సినిమా 'కరుప్పు' బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు మూవీ రెడీ అవుతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

శిల్ప శెట్టి ఈ మధ్య 'మా హై నా' కూకింగ్ షోతో పాపులారిటీ సంపాదిస్తోంది. ఈ షోను శిల్ప స్వయంగా హోస్ట్ చేస్తోంది. ఈ షో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe