...
...
Next Story

ఓటీటీలో నవంబర్ చివరి వారంలో స్పెషల్‌గా 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడెక్కడ చూడాలంటే?

నవంబర్ చివరి వారం ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ గత వారం ఎన్నో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అలాగే, ఈ వారం కూడా అధిక సంఖ్యలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా 6 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.

Published on: Nov 24, 2025, 12:11:43 IST
Advertisement
<p>ఈ వారం కూడా అధిక సంఖ్యలో ఓటీటీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో చాలా స్పెషల్‌గా 6 సినిమాలు చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్న ఈ సినిమాల్లో జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ డ్రామా కూడా ఉంది. మరి ఈ వారం ఇంట్రెస్టింగ్ 6 ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.</p>

ఈ వారం కూడా అధిక సంఖ్యలో ఓటీటీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో చాలా స్పెషల్‌గా 6 సినిమాలు చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్న ఈ సినిమాల్లో జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ డ్రామా కూడా ఉంది. మరి ఈ వారం ఇంట్రెస్టింగ్ 6 ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ- 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సాలిడ్ హిట్ అందుకుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ఓటీటీ- అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ డ్రామా వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ప్రేక్షకుల కోసం వచ్చింది. ఈ సీజన్ నవంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్ మూడు భాగాలుగా విడుదల కానుంది, రెండు వాల్యూమ్‌లు నవంబర్ 26న, డిసెంబర్ 25, 2025న ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇక ఈ సీజన్ ఎపిసోడ్స్ అన్ని డిసెంబర్ 31న వస్తాయి.

సన్నీ సంస్కారి కీ తులసి కుమారి ఓటీటీ- వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. ఈ చిత్రం నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

రక్తబీజ్ 2 ఓటీటీ- 2023 సంవత్సరంలో వచ్చిన బెంగాలీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రక్తబీజ్ ప్రేక్షకులకు నచ్చింది, ఇప్పుడు రక్తబీజ్ రెండవ భాగం ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అలాగే జెనియా సేన్ రచించారు. జీ5లో నవంబర్ 28 నుంచి రక్త బీజ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

రేగై ఓటీటీ- వైద్య బృందం చేసే ప్రమాదకరమైన కుట్రను వెలికితీసే సబ్ ఇన్‌స్పెక్టర్ కథనే రేగై సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన రేగై జీ5లో నవంబర్ . ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది.

ప్రిమిటివ్ వార్ ఓటీటీ- ప్రిమిటివ్ వార్ అనేది వియత్నాం యుద్ధంలో తప్పిపోయిన ప్లాటూన్‌ను కనుగొనడానికి మారుమూల అడవి లోయకు పంపబడిన వ్యక్తి కథ ఆధారంగా రూపొందించారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 28న ప్రిమిటివ్ వార్ ఓటీటీ రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe