...
...
Next Story

ఫోన్ ట్యాపింగ్ కేసు : బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌కు ‘సిట్’ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 27న హాజరు కావాలని ఆదేశించింది.

Published on: Jan 26, 2026 10:05 PM IST
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇటీవలనే హరీశ్ రావు, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న హాజరు కావాలని ఆదేశించింది.

మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్‌ నోటీసులు
మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్‌ నోటీసులు

జనవరి 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీలో సంతోష్ రావు కూడా కీలక నేతగా ఉన్నారు. మరోవైపు సిట్‌ నోటీసులపై సంతోష్‌ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని.. సిట్‌ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును సిట్ గతంలో ప్రశ్నించింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి)లో పని చేసిన డీఎస్పీతో సహా నలుగురు పోలీసు అధికారులను మార్చి 2024లో అరెస్ట్ కూడా చేశారు. వివిధ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించడంతో పాటు గత బిఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe