ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మచిలీపట్నం, తిరుపతి నుంచి హైదరాబాద్ సిటీకి వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడవనున్నాయి.

మచిలీపట్నం - ఉమ్డానగర్ మధ్య ప్రత్యేక రైలు (07297 నెంబర్) ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇది ఈనెల 18వ తేదీన రాత్రి 9.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 9.45 గంటలకు ఉమ్డానగర్ కు చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్…. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్ల మీదుగా ఉమ్డానగర్ స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
ఇక తిరుపతి - కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు (07296 నెంబర్) అందుబాటులో ఉంటుంది.ఈ ట్రైన్ జనవరి 19వ తేదీన రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతిలో బయల్దేరి… మరునాడు ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
తిరుపతి - ప్రయాగరాజ్ మధ్య(ట్రైన్ నెంబర్ 07298 ) స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ డిసెంబర్ 20వ తేదీన తిరుపతి నుంచి ఉదయం 8.15 నిమిషాలకు బయల్దేరుతుంది. రెండో రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రయాగరాజ్ కు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, గుత్తి, గుంతకల్, మంత్రాలయం, రాయచూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్ మీదుగా వెళ్తుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.