గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు.గురువారం, శుక్రవారాల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా… చివరిరోజు అయిన శనివారం మాత్రం భారీగానే నామినేషన్లు వేశారు. పలుచోట్ల అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది.

సర్పంచ్ పదవులకు తొలి రెండు రోజుల్లో 8,198 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. తొలిరోజు 3,297 నామినేషన్లు రాగా, రెండో రోజు శుక్రవారం 4,901 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు సర్పంచ్ స్థానాల కోసం 20 వేలకు పైగా…. వార్డు సభ్యులకు 50వేలకు పైగా దాఖలయ్యాయి. ఎన్నికల సంఘం అధికారికంగా వివరాలను ప్రకటించాల్సి ఉంది.
ఇవాళ పరిశీలన… డిసెంబర్ 3న ఫైనల్ లిస్ట్
ఇవాళ మొదటి విడత నామినేషన్లను పరిశీలిస్తారు. చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్ల స్వీకరణ, డిసెంబర్ 2వ తేదీన అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు.
డిసెంబర్ 11న పోలింగ్…
మొదటి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉప సర్పంచి ఎన్నికను కూడా పూర్తి చేస్తారు.
మరోవైపు ఆదివారం నుంచే రెండో విడత నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుంది. డిసెంబరు 2 వరకు వీటిని స్వీకరిస్తారు. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ ఉండగా… అధే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఇక చివరి విడత పోలింగ్ డిసెంబర్ 17వ తేదీ నిర్వహిస్తారు.
కొనసాగుతున్న ఏకగ్రీవాలు…
మరోవైపు చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. . వికారాబాద్ జిల్లాలో 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 10 పంచాయతీలు ఉండగా…. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 8 పంచాయతీలు ఉన్నాయి.
{{/usCountry}}మరోవైపు చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. . వికారాబాద్ జిల్లాలో 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 10 పంచాయతీలు ఉండగా…. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 8 పంచాయతీలు ఉన్నాయి.
{{/usCountry}}ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనా కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అదే గ్రామానికి చెందిన మల్లేపాకుల వెంకటయ్య(అలియాస్ మోహన్) ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన మావోయిస్టు పార్టీలో పని చేయగా… 2001లో లొంగిపోయారు. చాలారోజుల పాటు హోంగార్డుగా విధులు నిర్వర్తించగా… తాజాగా సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. ఇయన సీఎం రేవంత్ రెడ్డికి చిన్ననాటి మిత్రుడు. వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి.
ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది.నవంబర్ 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.