ఏపీ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి అయిన సంగతి తెలిసిందే. విద్యార్థులంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలుపెట్టిన జవాబు పత్రాల మూల్యాంకనం కూడా తాజాగానే పూర్తి అయింది.
స్పాట్ వాల్యూయేషన్ పూర్తి….

రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్వోలు, సీఎస్లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్తో పాటు ట్యాబ్ల్లోనూ నమోదు చేశారు. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్లను తీసుకొచ్చారు. మొదట్లో ట్యాబ్ లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ… చివరగా ఈ ప్రక్రియ కూడా పూర్తి అయింది.
మూల్యాంకనం పూర్తి అయినే నేపథ్యంలో ప్రస్తుతం మార్కులను ప్రాసెసింగ్ చేస్తున్నారు. సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. అంతా సవ్యంగా ఉంటే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ఫలితాల వివరాలను వెల్లడిస్తారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షలు జరిగాయి. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడు..?
గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. కాబట్టి ఏప్రిల్ నాల్గో వారం లేదా మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
{{/usCountry}}గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. కాబట్టి ఏప్రిల్ నాల్గో వారం లేదా మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
{{/usCountry}}ఏపీ పదో తరగతి ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే… మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది.