ఏపీ జూనియర్ లెక్చరర్ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచింది.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియపై కూడా ఏపీపీఎస్సీ ప్రకటన చేసింది. డిసెంబర్ 16, 17 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. ఏపీపీఎస్సీ బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్, ఎంజీ రోడ్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ - 520010 చిరునామాకు రావాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని పేర్కొంది.
ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి చెక్ లిస్ట్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా ఒరిజినల్ ధ్రువపత్రాలను అటెస్టేషన్ చేసుకొని ఉండాలి. కాల్ లెటర్ కూడా ఏపీపీఎస్సీ నుంచి అందనుంది. కాల్ లెటర్ అందని అభ్యర్థులు… https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లే అభ్యర్థులు చెక్ లిస్ట్ లో పేర్కొన్న విధంగా మెమోలు, ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణపత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమిషన్ వెబ్ సైట్ లో సూచించిన విధంగా తగిన పత్రాలను సమర్పించాలి.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- అభ్యర్థులు https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హోంపేజీలో కనిపించే జూనియర్ లెక్చరర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
- రిజల్ట్ నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే ఎంపికైన వారి హాల్ టికెట్లతో పాటు పీడీఎఫ్ ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.