ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులను ఇప్పటికే ప్రకటించింది. అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ప్రణాళికలు వేసింది ఆర్టీసీ. ఇదే సమయంలో మరో విషయం తెరపైకి వచ్చింది. ఆర్టీసీలోని 2,419 అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది.

అద్దె పెంచాలని అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంతో పడిన అదనపు భారం మేరకు చెల్లింపులు చేయాలని అడుగుతున్నారు. నష్టాలు వస్తున్న కారణంగా తమకు అద్దె పెంచాలని చెబుతున్నారు. ఒకవేళ అద్దె పెంచకపోతే.. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానులు నోటీసులు పంపేందుకు రెడీ అయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం నడుస్తోంది. దీని ద్వారా బస్సుల నిర్వహణ వ్యయ పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.15వేల నుంచి 20 వేల వరకు అదనంగా ఇవ్వాలని అభ్యర్థించారు.
అద్దె బస్సుల యజమానుల అభ్యర్థనను పరిశీలించిన ఆర్టీసీ.. నెలకు రూ.5200 ఇచ్చేందుకు సర్క్యూలర్ జారీ చేసింది. తమతో చర్చించి అద్దె మెుత్తాన్ని మరింత పెంచాలని వారు చెబుతున్నారు. స్వల్పంగా పెంచిన అద్దెపై అద్దె బస్సుల యజమానుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.
సమ్మె జరిగితే సంక్రాంతి పండుగకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అద్దె బస్సుల యజమానులతో చర్చించేందుకు సిద్ధమవుతోంది. ఈ బస్సుల సేవల నిలిచిపోతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సొంత ఊర్లకు వెళ్లేవారికి చాలా సమస్యలు ఎదురవుతాయి.
{{/usCountry}}సమ్మె జరిగితే సంక్రాంతి పండుగకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అద్దె బస్సుల యజమానులతో చర్చించేందుకు సిద్ధమవుతోంది. ఈ బస్సుల సేవల నిలిచిపోతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సొంత ఊర్లకు వెళ్లేవారికి చాలా సమస్యలు ఎదురవుతాయి.
{{/usCountry}}పండుగ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వీటిలో అధిక శాతం సర్వీసులు రాష్ట్ర అంతర్గత మార్గాలకే పరిమితమవుతాయి. వీటిలో 71 శాతానికి సమానమైన 6,000 బస్సులు ఆంధ్రప్రదేశ్లోపలే నడుస్తాయి. మిగిలిన 2,432 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి అంతర్రాష్ట్ర మార్గాల్లో నడిపిస్తారు.
పండుగకు ముందు 3,857 ప్రత్యేక సర్వీసులను నడుపనుంది ఏపీఎస్ఆర్టీసీ. వీటిలో 3,500 బస్సులు రాష్ట్ర అంతర్గత మార్గాల్లో నడుస్తాయి. 240 సర్వీసులు హైదరాబాద్కు, 102 బెంగళూరుకు, 15 చెన్నైకి నడుస్తాయి. సాధారణంగా నడిచేవాటికి ఇవి అదనం.
సంక్రాంతి తర్వాత ఏపీఎస్ఆర్టీసీ 4,575 ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. వీటిలో 2,500 బస్సులు రాష్ట్రంలోపలే నడుస్తాయి. 1,800 సర్వీసులు హైదరాబాద్కు, 200 బెంగళూరుకు, 75 చెన్నైకి నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు.