...
...
Next Story

AP 10th Class : పదో తరగతి మార్కుల ఎంట్రీకి సంబంధించి ఈ కొత్త నిబంధన తెలుసా?

AP 10th Class : త్వరలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం మెుదలుకానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు కొత్త నిబంధన ప్రకారం ఈసారి మార్కులను నమోదు చేయాల్సి ఉంది.

Updated on: Mar 29, 2026, 22:10:54 IST
Advertisement

ఏప్రిల్ 2న పదో తరగతి పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం ఏప్రిల్ 6వ తేదీన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో 10 రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కచ్చితత్వం.. క్రమశిక్షణ ఉండేలా చూసేందుకు ఉన్నతాధికారులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతి సహాయక పరిశీలకునికి రోజుకు 40 జవాబు పత్రాలు కేటాయిస్తారు. వాటిలో 20 ఉదయం సెషన్‌లో, మరో 20 మధ్యాహ్నం సెషన్‌లో మూల్యాంకనం అవుతాయి. మూల్యాంకనం సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినమైన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ఒక కొత్త నిబంధన ప్రకారం, మార్కులను మాన్యువల్‌గా, టాబ్లెట్‌లను ఉపయోగించి డిజిటల్‌గా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు రెండింటికీ వర్తించే ఈ విధానం, మార్కుల లెక్కింపులో తప్పులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గత సంవత్సరం నివేదించిన సమస్యల దృష్ట్యా, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, వ్యత్యాసాలను నివారించడానికి, మార్కులను రియల్ టైమ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

మార్కుల నమోదు ప్రక్రియ ఏప్రిల్ 14న ప్రారంభమై 10 రోజుల్లో పూర్తి కానుంది. ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. గత సంవత్సరం, ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించారు.

ఇదిలా ఉండగా, మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్‌తో ముగుస్తాయి. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ 3,415 కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks